మీడియా ప్రతినిధులపై చింతమనేని అనుచితవ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

మీడియా ప్రతినిధులపై చింతమనేని అనుచితవ్యాఖ్యలు

Published Tue, Oct 30 2018 3:53 PM

టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రెచ్చిపోయారు. తాను నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలపై దాడులు చేసిన విజిలెన్స్‌ అధికారులపై చింతమనేని దౌర్జన్యానికి దిగారు. దీంతో ఈ ఘటనపై విజిలెన్స్‌ అధికారులు పెదవేగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చింతమనేని తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, తమను భయభ్రాంతులకు గురిచేశారని వెజిలెన్స్‌ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.