ఈనాటి ముఖ్యాంశాలు | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Fri, Oct 11 2019 8:46 PM

ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌ అలీకి ఈ ఏడాదికిగానూ ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారం దక్కింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అరుదైన గౌరవం లభించింది. యువజన సర్వీసులు, పర్యాటకశాఖపై శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2022 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు అన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్‌ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏడో రోజు విజయవంతంగా సాగుతోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

Advertisement
Advertisement