సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ లేఖ | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ లేఖ

Published Wed, Dec 26 2018 8:04 AM

వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను తగ్గించి పంచాయతీ రాజ్‌ ఎన్నికలను నిర్వహించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించబోదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా బీసీ ఓటర్ల గణన చేపట్టి వారి జనాభా ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement