ఏటీఎంలో డబ్బులు పెట్టే వ్యాన్‌లో చోరీ | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో డబ్బులు పెట్టే వ్యాన్‌లో చోరీ

Published Tue, May 7 2019 1:17 PM

నగరంలోని వనస్థలిపురంలో భారీ దోపిడి జరిగింది. ఏటీఎంలో డబ్బులు పెట్టే వ్యాన్ల నుంచి భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లారు. ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా.. సిబ్బంది దృష్టి మరల్చి దాదాపు 70లక్షలను దుండగులు దోచుకెళ్లారు. యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా ఈ చోరి జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.