చంద్రబాబు నాగ్‌పూర్‌ ఎందుకు వెళ్లారు ? | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నాగ్‌పూర్‌ ఎందుకు వెళ్లారు ?

Published Wed, Oct 18 2017 12:39 PM

పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అవినీతికి పాడి ఆవులా వాడుకుంటున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్‌ హయాంలో రూ.16వేల కోట్లు మాత్రమే ఉన్న అంచనా వ్యయాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెట్టింపు చేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ ఎంపీనే కాంట్రాక్టర్‌ అని ఆయన చెప్పారు. పోలవరాన్ని అవినీతి రహిత ప్రాజెక్టుకుగా నిర్మించాలని డిమాండ్‌ చేశారు. అవినీతి రహితంగా ప్రాజెక్టు నిర్మించాలని కేంద్రమంత్రి గడ్కరీనే అన్నారని, హడావుడిగా చంద్రబాబు ఎందుకు నాగ్‌పూర్‌ వెళ్లారని ప్రశ్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement