నేటికి సమాజంలో మహిళల మీద వేధింపులు జరుగుతున్నాయి. వేధించిన వారిని శిక్షించటానికి ఎన్ని చట్టాలు వచ్చినా ఆకతాయిల ఆగడాలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ యువతి రైలు నుంచి కిందికి దూకేసింది. విజయవాడకు చెందిన షేక్ హజ్మూలా చెన్నైలో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. పెద్దలు విజయవాడలో పెళ్లి చూపులు ఏర్పాటు చేయటంతో సొంతూరుకు నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరింది. అయితే, ఆమెను కొందరు ఆకతాయిలు మద్యం సేవిస్తూ వేధింపులకు పాల్పడ్డారు. వారి చేష్టలను భరించలేక ఆమె ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్ దగ్గర రైలులో నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు 108 అంబులెన్స్లో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పెళ్లి చూపులకొచ్చి రైలు నుంచి దూకేసింది..
Published Thu, Aug 31 2017 5:48 PM
Advertisement
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement