చెరువు భూములతో పాటు దేవుళ్లకూ రక్షణ లేదు | Sakshi
Sakshi News home page

చెరువు భూములతో పాటు దేవుళ్లకూ రక్షణ లేదు

Published Mon, Apr 23 2018 1:40 PM

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో పాలన ఎలా ఉందంటే.. గుడిని, గుడిలో లింగాన్ని మింగేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కిందంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ప్రజలకే కాదు ఆలయాలకు, దేవుళ్లకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ జగన్ విమర్శించారు. 143వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం గన్నవరంలో బ్రహ్మలింగయ్య చెరువును వైఎస్ జగన్ పరిశీలించారు. నీరు-చెట్టు పథకం కింద ఇసుక, మట్టిని టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ వైఎస్ జగన్‌కు స్థానికులు వివరించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement