ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్బంగా సంఘీబావంగా నిన్న(సోమవారం) జననేతతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. మంగళవారం పాదయాత్ర ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయడు అవినీతిని, అక్రమాలను 3000 కిలోమీటర్ల పాదయాత్రలో వైఎస్ జగన్ వివరించారన్నారు. టీడీపీ ప్రభుత్వ దోపిడీ ఏ విధంగా ఉందో పాదయాత్రలో ప్రజలు జననేతకు చెప్పారన్నారు. తమ పార్టీ అధినేత చెప్పే ప్రతీ మాట నిజమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. టీడీపీ కంచుకోటగా చెప్పుకునే ఉత్తరాంధ్రలో ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ఆదరణే అందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలంతా ఆవేదన చెందుతున్నారని.. అందుకే పాదయాత్రలో వైఎస్ జగన్కు అండగా నిలుస్తున్నారన్నారు.
ప్రజాసంకల్పయాత్ర ఒక చరిత్ర:భూమన
Published Tue, Sep 25 2018 10:50 AM
Advertisement
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement