'వైఎస్‌ జగన్ ఆదుకున్నారు తప్ప ప్రభుత్వం కాదు' | Sakshi
Sakshi News home page

'వైఎస్‌ జగన్ ఆదుకున్నారు తప్ప ప్రభుత్వం కాదు'

Published Sat, Jul 8 2017 1:09 PM

రానున్న కాలంలో రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కోసం, బడుగు బలహీన వర్గాల వారికోసం ముఖ్యమంత్రి కానున్న నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విశాఖపట్నంలో లక్షల కోట్ల విలువైన భూములు టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని, వాటిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీ సందర్భంగా ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు తీర్మానాలు ప్రవేశ పెట్టారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్లీనరీల్లో చర్చించిన పలు అంశాల్లోని ముఖ్యమైన వాటిని ఆయా నేతలు జాతీయ ప్లీనరీలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల మధ్య ప్రకటించారు.

Advertisement
Advertisement