జగన్‌పై హత్యాయత్నానికి బాబు కుట్ర: వైవీ సుబ్బారెడ్డి | Sakshi
Sakshi News home page

జగన్‌పై హత్యాయత్నానికి బాబు కుట్ర: వైవీ సుబ్బారెడ్డి

Published Fri, Nov 30 2018 5:46 PM

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వస్తోన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక జగన్‌ను అంతమొందించాలని బాబు కుట్ర పన్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వంచనపై గర్జన దీక్షలో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు.  ప్రతిరంగంలోనూ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, పోలవరం విషయంలో హామీలిచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనతో ఏపీ చాలా నష్టపోయింది.. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భావించి వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని తెలిపారు.

Advertisement
Advertisement