జేసీ అనుచరుల ఆగడాలను అరికట్టండి | Sakshi
Sakshi News home page

జేసీ అనుచరుల ఆగడాలను అరికట్టండి

Published Thu, Mar 1 2018 7:39 PM

తాడిపత్రిలో శాంతిభద్రతలను కాపాడాలని ఓఎస్డీ ఐశ్వర్య రస్తోగిని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు. జేసీ అనుచరుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక సబ్‌ డివిజనల్‌ పోలీసు కార్యాలయంలో ఓఎస్డీని వైయస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్‌రెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌బాషా, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పైలా నర్సింహయ్యలు కలిశారు. మంగళవారం రాత్రి మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌బాషాపై జరిగిన హత్యాయత్నం గురించి ఓ ఎస్డీకి వివరించారు.