సచిన్‌, లక్ష్మణ్‌లు కూడా ధోని కనుసన్నల్లోనే | Sakshi
Sakshi News home page

సచిన్‌, లక్ష్మణ్‌లు కూడా ధోని కనుసన్నల్లోనే

Published Fri, May 17 2019 9:07 PM

ఎంఎస్‌ ధోని సారథ్యంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. 28ఏళ్ల సుదీర్గ నిరీక్షణ తర్వాత టీమిండియా రెండో సారి ప్రపంచకప్‌ను ముద్దాడింది ఈ లెజెండ్‌ కెప్టెన్సీలోనే. ఇక ప్రపంచకప్‌తో పాటు మూడు ఐసీసీ టోర్నీలను ధోని నాయకత్వంలోనే టీమిండియా గెలుచుకుంది. అయితే మైదానంలో తనకు కావాల్సిన ప్రదర్శనను ఆటగాళ్లను నుంచి రాబట్టుకోవడంలో ధోని దిట్ట. అయితే మ్యాచ్‌లనే కాకుండా ప్రాక్టీస్‌లోనూ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తునే వారి ప్రతిభను గుర్తించి వెలికితీస్తుంటాడు.