మ్యాచ్‌ గెలిస్తే కొత్త చరిత్రే! | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ గెలిస్తే కొత్త చరిత్రే!

Published Sat, Feb 10 2018 7:02 AM

దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత పర్యటనలో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను మాత్రం తమ ఖాతాలో వేసుకొని తిరిగి వెళ్లింది. ఇప్పుడు ఆ లెక్క సరి చేయడంతో పాటు సఫారీ గడ్డపై మొదటి సిరీస్‌ గెలుచుకునేందుకు కోహ్లి సేన ఉత్సాహంగా ఉంది. వరుస విజయాలతో కోహ్లి సేనలో ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటుతుండగా, డివిలియర్స్‌ రాకతో సఫారీ జట్టు తమ బలం పెరిగినట్లుగా భావిస్తోంది.