-
వైభవంగా వసంతోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని శోభాయమానంగా పూలమాలలతో అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం అమ్మవారికి వసంతోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఉదయం చతురన్తసేవ, రాత్రి సర్వభూపాల వాహనం (విమానకసేవ)పై ఊరేగించారు. హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలకు గౌడ కుల సంఘం ఉభయదాతలుగా వ్యవహరించింది. కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్, నకరకంటి మోహన్గౌడ్, ఎంపీటీసీ సౌజన్యగౌడ్, రవీందర్గౌడ్, రాంమూర్తి గౌడ్ పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండివిద్యారణ్యపురి: ఈనెల 24నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిక్తాపట్నాయక్ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఉండాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించాలన్నారు. గ్రూప్–1పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లాలో టీఎస్పీఎస్సీ గ్రూప్–1 పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. జూన్9న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఉంటుందన్నారు. 45 కేంద్రాల్లో నిర్వహించే అ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆర్టీసీ బస్సులను ఉదయం 6గంటల నుంచే అభ్యర్థుల సౌకర్యార్థం నడపాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు రాధికాగుప్తా, వెంకట్రెడ్డి, డీసీపీ రవీందర్, ఆర్డీఓలు వెంకటేశ్, నారాయణ, జిల్లా డీఐఈఓ గోపాల్, డీఎంహెచ్ఓ సాంబశివరావు పాల్గొన్నారు. 8న లోక్ అదాలత్వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా కోర్టు, నర్సంపేట మండల కోర్టులో జూన్ 8న వేర్వేరుగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత తెలిపారు. కక్షిదారులు తమ వీలును బట్టి కేసులను రాజీ కుదుర్చుకోవాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. శనివారం వరంగల్ జిల్లా కోర్టులో జరిగిన సమావేశంలో జడ్జి ప్రేమలత మాట్లాడుతూ.. రాజీ మార్గం ద్వారా క్రిమినల్, సివిల్, భూ తగాదాలు, మోటార్ వెహికిల్ యాక్సిండెంట్, వివాహ, కుటుంబ తగాదాలు, ఇన్సూరెన్స్, ఎక్సైజ్, విద్యుత్ చోరీ, కన్జూమర్ ఫోరమ్, ట్రాఫిక్ ఈచలాన్ కేసులు, ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు హాజరై తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్ధం కావాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్లో గుర్తించబడిన కేసుల్లో మొత్తం 829 రాజీపడదగు పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని, వీటిలో క్రిమినల్–719, ఎన్ఐ యాక్ట్14, ఎంఎసీటీ 47, అదర్ సివిల్ 49, ప్రీ లిటిగేషన్ ఎలక్ట్రిసిటీ కేసులు 800, బ్యాంకు కేసులు 150, బీఎస్ఎన్ఎల్ కేసులు 301 ఉన్నట్లు తెలిపారు. కక్షిదారులు వీలును బట్టి తమ కేసులను ఈనెల 14 నుంచి 07 జూన్ సాయంత్రం 5గంటల్లోపు ఏ రోజైనా రాజీ కుదుర్చుకునేలా లోక్ అదాలత్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రీ లోక్ అదాలత్లో ప్రీ లిటిగేషన్ కేసులు, రాజీ పడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈజాతీయ లోక్ అదాలత్, ప్రీలోక్ అదాలత్పై సలహాలు, సందేహాలకు, న్యాయ సహాయం కోసం న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించాలని, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. -
తండ్రి ప్రైవేట్ ఉద్యోగి, తల్లిది కుట్టు పని
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్, లలిత కుమారుడు మణితేజ. 1 నుంచి ఆరో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో చదివాడు. వేణుగోపాల్ పిల్లల చదువు కోసం ఆరేళ్ల క్రితం హైదరాబాద్కు భార్యా పిల్లలతో వెళ్లాడు. అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. భార్య లలిత ఇంటి వద్ద మిషన్ కుడుతూ పిల్లలను చదివించారు. ఈక్రమంలో మణితేజ 6 నుంచి పదోతరగతి వరకు హైదరాబాద్లోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. పదోతరగతిలో 8.2 జీపీఏ మార్కులు సాధించిన మణితేజ ఇంటర్ హైదరాబాద్ కూకట్పల్లి ఎస్ఆర్ శ్రీగాయత్రి కళాశాలలో ఎంపీసీ చదివాడు. ఇంటర్లో 715 మార్కులు సాధించాడు. కాగా ఈఏపీసెట్లో ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించి అందరి మన్ననలు పొందాడు. స్టేట్ ర్యాంక్ సాధించిన మణితేజను శివునిపల్లి వాసులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. -
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)ఆదివారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2024పాలకమండలికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలే..గత మూడేళ్లలో వీసీ ప్రొఫెసర్ రమేశ్ విద్యార్థి వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అనేక అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై అనేకసార్లు గతంలో పాలకమండలికి ఫిర్యాదు చేశాం. అయినా పట్టించుకోలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చివరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రభుత్వం స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణలో నిజానిజాలు నిగ్గు తేలుస్తారన్న నమ్మకం ఉంది. ●– మామిడాల ఇస్తారి, అకుట్ జనరల్ సెక్రటరీన్యూస్రీల్ -
ఓరుగల్లు మాణిక్యాలు
మధ్య తరగతి కుటుంబంలో విద్యా కుసుమాలు వికసించాయి. కఠోర శ్రమ, అంకుఠిత దీక్షతో విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈఏపీసెట్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మెరిశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో మెరుగైన ర్యాంకులు సాధించి జిల్లా పేరును నిలబెట్టారు. హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన శ్రీవర్షిణి రాష్ట్రస్థాయిలో (అగ్రికల్చర్, ఫార్మసీ) 3వ ర్యాంకు, జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లికి చెందిన కొంతం మణితేజ 9వ ర్యాంకు (ఇంజనీరింగ్) సాధించారు. – స్టేషన్ఘన్పూర్/హన్మకొండ చౌరస్తా ఈఏపీసెట్లో మనోళ్లకు స్టేట్ ర్యాంక్లు ● అగ్రికల్చర్, ఫార్మసీలో శ్రీవర్షిణికి 3వ ర్యాంక్ ● ఇంజనీరింగ్లో కొంతం మణితేజకు 9వ ర్యాంక్ ● తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చిన విద్యార్థులు ● అభినందనలతో ముంచెత్తిన స్థానికులు, బంధువులు -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
– వివరాలు 8లోuబీజేపీకి అనుకూల వాతావరణం● ప్రేమేందర్రెడ్డి గెలుపునకు కృషి చేయాలి ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డిశిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేత సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), పింపుల్ ట్రీట్మెంట్, హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు. వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈనెల 22నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం : శ్రీ శైలి బ్యూటీపార్లర్, మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, హనుమకొండ సెల్ : 9505514424 ఫీజు : రూ.3 వేలు -
కూతుర్ని డాక్టర్గా చూడాలి..
మాది మధ్య తరగతి కుటుంబం. పిల్లలు చదువుల్లో రాణిస్తే అంతకంటే తల్లిదండ్రులకు ఏముంటుంది. వర్షిణి మొదటి నుంచి చదువులో మేటి. కుమారుడు ప్రయోజకుడయ్యాడు. కూతురు శ్రీవర్షిణిని డాక్టర్గా చూడాలన్నది మా కోరిక. ఈవిషయం ఎప్పుడూ చెప్పేవాళ్లం. మా ఆకాంక్షలకు అనుగుణంగా చదివింది. రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. నిన్నమొన్నటి వరకు పక్క వీధికి కూడా తెలియని మా అమ్మాయి ఇప్పుడు రాష్ట్రమంతా తెలిసింది. ఎంతో సంతోషంగా ఉంది. – గడ్డం కన్నయ్య, లావణ్య, శ్రీవర్షిణి తల్లిదండ్రులు -
ఇంటర్వర్సిటీ పోటీలకు ఎంపిక
కేయూ క్యాంపస్: చైన్నెలోని టీఎన్పీఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఈనెల 20 నుంచి 25 వరకు నిర్వహించనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పురుషుల, మహిళల టోర్నమెంట్కు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్బోర్డ్ సెక్రటరీ వెంకయ్య తెలిపారు. పురుషుల జట్టులో లక్ష్మీప్రణయ్, టి.విగ్నేశ్ (యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సుబేదారి హనుమకొండ) చంద్రప్రకాశ్ (కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, హనుమకొండ) ఉన్నారు. మహిళా జట్టులో జి.శుత్రి వీసీపీఈ బొల్లికుంట, సీహెచ్ ప్రత్యూష (వాగ్దేవి డిగ్రీ కాలేజీ, హనుమకొండ) ఉన్నట్లు వెంకయ్య తెలిపారు. హనుమకొండలోని అరోరా డిఽగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎం.చైతన్య భగత్ ఈజట్టుకు మేనేజర్గా వ్యవహరించనున్నట్లు వారు పేర్కొన్నారు. -
పిల్లల చదువు కోసమే హైదరాబాద్..
ఊళ్లో సరైన పని దొరకలేదు. జీవనోపాధి కోసం, పిల్లల చదువుల కోసం ఆరేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చాం. నేను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నా భార్య మిషన్ కుడుతోంది. మణితేజ, కుమార్తె మానసను కష్టపడి చదివిస్తున్నాం. మణితేజకు పదో తరగతిలో అనుకున్నన్ని మార్కులు రాలేదు. చదువు విలువను తెలిపి పిల్లలను మోటివేట్ చేశాం. ఐదేళ్లు కష్టపడి చదివితే భవిష్యత్ బాగుంటుందని చెప్పేవాళ్లం. ఈఏపీసెట్లో 9వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. – కొంతం వేణుగోపాల్, మణితేజ తండ్రి -
స్కూల్ స్థాయి నుంచి టాపరే..
హనుమకొండలోని రెడ్డి కాలనీకి చెందిన గడ్డం శ్రీవర్షిణి అగ్రికల్చర్, ఫార్మసీలో (హాల్ టికెట్ నంబర్ 2411ఆర్09048, మార్కులు 145.255026) రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించింది. అప్పటి వరకు ఇరుగుపొరుగు వారికి అంతంత మాత్రంగానే తెలిసిన శ్రీవర్షిణి సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించడంతో కాలనీవాసుల అభినందనలతో తల్లిదండ్రులు మురిసిపోయారు. గడ్డం కన్నయ్య, లావణ్య దంపతుల కుమార్తె శ్రీవర్షిణి, కుమారుడు ఫణితేజ. ఫణితేజ కర్ణాటకలోని ధార్వాడలో ఐఐటీ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కన్నయ్య ప్రైవేట్ సంస్థలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండగా.. తల్లి లావణ్య గృహిణి. శ్రీవర్షిణి పదో తరగతి వరకు ఓ ప్రైవేట్ స్కూల్లో చదివి 10/10 మార్కులు సాధించింది. హైదరాబాద్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివి 987 మార్కులు తెచ్చుకుంది. శ్రీవర్షిణి ఇటీవల నీట్ రాసింది. అందులోనూ 200లోపు ర్యాంక్ వస్తుందని ఈసందర్భంగా ఆమె ధీమా వ్యక్తం చేసింది. -
మైసయ్యనగర్, గాంధీనగర్ జలమయమే..
కొద్దిపాటి వర్షానికే వరంగల్ 19వ డివిజన్లోని గాంధీనగర్, వివేకానంద కాలనీ, 35వ డివిజన్లో మైసయ్యనగర్, శివనగర్లో కొంతభాగం, సాయి కన్వెన్షన్ హాల్ ప్రాంతం జలమయమవుతున్నాయి. గాంధీనగర్కు పైన ఉన్న గొర్రెకుంటలోని కట్టమల్లన్న చెరువు వరద, లేబర్కాలనీ, అబ్బనికుంట నుంచి వరద నీరు మొత్తం గాంధీనగర్ను ముంచేస్తోంది. అక్కడినుంచి సాయిగణేశ్కాలనీ, వివేకానంద కాలనీలు కూడా నీటమునుగుతున్నాయి. కట్ట మల్లన్న చెరువు వరద నీరు కిందికి రాకుండా వంద ఫీట్ల రోడ్డులో పెద్ద డ్రెయినేజీ నిర్మిస్తే ముంపు తప్పుతుంది. కానీ, ఆ దిశగా చర్యలు లేవు. 35వ డివిజన్లో మైసయ్యనగర్కు మాల అగడ్డనుంచి వరద నీరు వస్తుంది. మైసయ్యనగర్, శివనగర్కు ముంపు తప్పాలంటే శివనగర్ ఆండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తి కావాలి. -
శనివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2024
రెండున్నర దశాబ్దాల కిందట ఏర్పడిన కాలనీ అంటే సమస్యలు ఉండకపోవచ్చని అనుకుంటాం కానీ.. ఇటీవల కొత్తగా ఏర్పడిన 14వ డివిజన్లోని సాయినగర్ కాలనీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. పక్కా డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే కాలనీ అంతా జలమయమవుతోంది. ఇది ఒక్క సాయినగర్కాలనీలోనే కాదు.. నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. అశాసీ్త్రయంగా డ్రెయినేజీల నిర్మాణం, కాల్వ ల్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు పూడికతీయక జల్లులకే కాలనీలో ముం‘చెత్తు’తున్నాయి. కాలనీలే కాదు వరంగల్ ప్రాంత ప్రజలకు సేవలు అందించే బల్దియాకు చెందిన కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయమూ మోకాల్లోతు వరదతో స్తంభించిపోతోంది. న్యూస్రీల్సమస్యల వలయంలో సాయినగర్ -
నాలాల మూలాలు తేల్చండి
వరంగల్ అర్బన్ : నగరంలోని ప్రధాన నాలాల మూలాలు తేల్చాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీవాకడే ఆదేశించారు. హనుమకొండలోని నయీంనగర్ నాలా, బ్రిడ్జి పనులను కమిషనర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కోసం 3, 4 రోజుల్లో నీటిపారుదల శాఖ అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టాలని సూచించారు. ప్రెసిడెన్సీ స్కూల్ నుంచి గుండ్లసింగారం బ్రిడ్జి వరకు రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే చేయాలని కోరారు. ఇరిగేషన్, రెవెన్యూ రికార్డుల ఆధారంగా నాలాల హద్దుల మేరకు రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని సూచించారు. కోర్టులో ఉన్న కేసులను గుర్తించి టౌన్ ప్లానింగ్ అధికారులు దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. సిటీప్లానర్ వెంకన్న, ఆర్డీఓ దత్తు, డీసీపీ ప్రకాశ్రెడ్డి, ఈఈ రాజయ్య, ఇరిగేషన్ ఈఈ ఆంజనేయులు, ఇరిగేషన్ డీఈ హర్షవర్ధన్, హనుమకొండ తహసీల్దార్ విజయ్కుమార్, స్మార్ట్సిటీ పీఏంసీ ఆనంద్ ఓలేటి పాల్గొన్నారు. -
భద్రకాళి ఆలయంలో డోలోత్సవం
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉద యం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించి పాలభోగం, క్షీరాన్న నివేదన జరిపారు. అమ్మవారి మూలమూర్తిని పూమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారికి డోలోత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని భద్రపీఠం, సాయంత్రం అశ్వవాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వరంగల్ కమ్మసేవా సంఘం బాధ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. కమ్మసేవా సంఘం అధ్యక్షుడు మందటి కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గంగవరపు రామకృష్ణప్రసాద్, ఉపాధ్యక్షులు కూనాటి హరిబాబు, రాంబాబు పాల్గొన్నారు. వరంగల్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓ శేషుభారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పీవీ నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్గా కృష్ణయ్యకేయూ క్యాంపస్ : కేయూలోని పీవీ నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్గా పొలిటికల్ సైన్స్ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గడ్డం కృష్ణయ్యను నియమిస్తూ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు కృష్ణయ్య బాధ్యతలు స్వీకరించారు. కుక్టా అధ్యక్షుడు శ్రీధర్కుమార్లోథ్, బాధ్యులు టి. నాగయ్య, సంకినేని వెంకన్న, కరుణాకర్రావు, మధుకర్రావు, చీకటి శ్రీనివాస్, సత్యనారాయణ, బ్రహ్మయ్య, సూర్యం విద్యాసాగర్, నర్సింహాచారి, అమరవేణి తదితరులు కృష్ణయ్యను అభినందించారు. -
No Headline
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఉపఎన్నిక పోలింగ్కు మరో తొమ్మిది రోజులే సమయం ఉంది. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికై రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక ప్రచారం ఇప్పటికే రసవత్తరంగా మారాల్సి ఉంది. ఈ నెల 13 వరకు లోక్సభ ఎన్నికల హడావుడి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు అంతగా పట్టించుకోలేదు. పార్లమెంట్ ఎన్నికల ఘట్టం ముగిసి ఆరు రోజులు గడిచినా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఇంకా అంటీముట్టనట్లే ఉంటున్నారు. పట్టభద్రులను కలిసే ప్రయత్నం చేయకపోగా.. ఓటర్ల జాబితా, ఫోన్ నంబర్లను సేకరించి మెసేజ్లు పంపడానికే పరిమితమవుతున్నారు. ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. ఒక్కరోజు ముందే ప్రచారాన్ని ముగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారం ఇంకా పట్టభద్రులను తాకకపోవడంపై ఓటర్లలో చర్చ జరుగుతోంది. పట్టభద్రులు పట్టం కట్టేది ఎవరికో... నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 52మంది పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కానీ, ప్రధాన పార్టీల ముఖ్యనేతలు కొందరు మాత్రం ఇంకా లోక్సభ ఎన్నికల మూడ్ నుంచి బయట పడలేదన్న చర్చ జరుగుతోంది. కాగా, ఈ స్థానంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 2007లో ఈ నియోజకవర్గం ఏర్పడగా, అప్పటి నుంచి జరిగిన మూడు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్.. ఎమ్మెల్సీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. 2021 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్)ను పార్టీ అభ్యర్థిగా బరిలో దింపింది. నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజు నుంచే ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తన స్థానాన్ని పదిలపర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి పలువురు సీనియర్లు టికెట్ ఆశించినా.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఏనుగుల రాకేశ్రెడ్డికి అవకాశం కల్పించారు. ఈయన అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ టికెట్ ఆశించిన, మద్దతు పలికిన నేతలు ఇంకా అసంతృప్తి వీడలేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డికే ఆ పార్టీ అధిష్టానం మళ్లీ అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి చెందిన ప్రేమేందర్రెడ్డి.. ఈసారి ఎలాగైనా విజయ తీరాలకు చేరాలని భావిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ ఓటర్లే కీలకం.. ఈ ఉప ఎన్నికలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్లు కీలకం కానున్నారు. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలోనూ అభ్యర్థులు కాకతీయ యూనివర్సిటీ, ఉమ్మడి వరంగల్ పట్టభద్రుల కేంద్రంగా ప్రచారం నిర్వహించారు. 2021 ఎన్నికల్లో గెలుపొందిన పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,61,811 ఓట్లు రాగా, ఆ తర్వాత స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 1,49,005 ఓట్లు సాధించారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్కు 71,126 ఓట్లు రాగా, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి (బీజేపీ) 39,306, రాములునాయక్ (కాంగ్రెస్) 27,729 ఓట్లతో సరిపెట్టుకున్నారు. రెండో ప్రాధాన్యం ఓట్లతో పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపొందగా.. ఆ పోలింగ్లో ఉమ్మడి వరంగల్ ఓటర్లు అత్యధికంగా ఓటుహక్కు వినియోగించుకున్నట్లు తేలింది. కాగా, ఎన్నికల అధి కారుల ప్రకటన మేరకు 12 జిల్లాల్లో మొత్తం 4,61,786 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 2,86,993, మహిళలు 1,74,788, థర్డ్జెండర్స్ ఐదుగురు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ మొత్తం ఓట్లలో అత్యధికంగా 1,67,849 మంది ఉమ్మడి వరంగల్లో ఉండగా.. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూడా ఇక్కడి ఓటర్లే కీలకం కానున్నారన్న చర్చ జరుగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు తొమ్మిది రోజులే సమయం ఇంకా ఊపందుకోని ప్రచారం.. ప్రధాన పార్టీల గెలుపు ధీమా.. అతి నమ్మకంలో అభ్యర్థులు అంటీముట్టనట్లుగా మూడు పార్టీల ముఖ్యనేతలు ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. -
స్కూల్ యూనిఫాం సిద్ధం : కలెక్టర్
హన్మకొండ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించేందుకు యూనిఫాం సిద్ధం చేస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలి పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి, ధాన్యం కొనుగోళ్లు, ధరణిపై కలెక్టర్లు, అధికారులతో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల అధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో నాణ్యత పాటించాలని అదేశించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలోని రెండు మండలాల పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన యూనిఫాంను కుట్టించడానికి ఏడు ఎస్హెచ్జీ బృందాలకు క్లాత్ అందించినట్లు తెలిపారు. అలాగే, డీఆర్డీఓ అధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కుట్టి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్లు రాధికాగుప్తా, వెంకట్రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్డీఓ నాగపద్మజ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, జిల్లా సహకార అధికారి నాగేశ్వర్రావు, డీఈఓ అబ్దుల్ హై, వ్యవసాయ శాఖ జేడీ రవీందర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
హనుమకొండ నయీంనగర్లోని పెద్ద మోరీ స్థలంలో వరద నీరు సాఫీగా వెళ్లేలా బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. గత నెలలో పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్ పురాతన బ్రిడ్జిని కూల్చివేశారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. అంతకుముందు హనుమకొండ గోపాలపూర్ చెరువు నుంచి ఇంజనీర్స్ కాలనీ వరకు డక్ట్ అండ్ డ్రెయిన్ నిర్మాణం చేశారు. దీంతో గతంలో ముంపునకు గురైన కుడా కాలనీ, టీవీటవర్ కాలనీ, అమరావ తినగర్, వివేక్నగర్ ముంపు నుంచి బయటపడ్డాయి. నయీంనగర్ బ్రిడ్జి సామర్థ్యం తక్కువగా ఉండడంతో బ్యాక్ వాటర్తో సమ్మయ్యనగర్, ఇంజనీర్స్ కాలనీ, గోకుల్నగర్, విద్యానగర్, రారాజీనగర్, రాంనగర్, క్రాంతినగర్, నెహ్రూనగర్, లష్కర్ సింగారం, నయీంనగర్ ప్రధాన రహదారి, కిషన్పుర ముంపునకు గురయ్యాయి. ఈ వర్షాకాలంలో ఈ కాలనీలు ముంపునకు గురి కాకుండా ఉండేందుకు నాలాకు ఇరువైపులా రివిట్వాల్ నిర్మిస్తున్నారు. నయీంనగర్ పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు సకాలంలో పూర్తవుతాయా అనే సందేహం ముంపు ప్రాంతాల ప్రజల్లో నెలకొంది. -
మళ్లీ కన్నెత్తి చూసింది లేదు
గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు హనుమకొండలోని 4,9,10 డివిజన్ల పరిధిలోని రాయపుర, కాకతీయకాలనీ, పెద్దమ్మగడ్డ, జ్యోతిరావుపూలే కాలనీలు నీట మునిగాయి. ఇళ్ల లోకి నీరు చేరడంతో మూడురోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జ్యోతిరావుపూలే కాలనీలోని ఓ ఇంట్లోకి వరద నీరు భారీగా చేరడంతో కుటుంబమంతా చిక్కుకుపోయింది. హనుమకొండ పోలీసులు, రెస్క్యూ టీంతో కుటుంబ సభ్యులను బయటికి తీసుకొచ్చారు. ఆయా ప్రాంతాలను అప్పటి ప్రభుత్వ పెద్దలు సందర్శించారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి చూసిన వారు లేరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌతమినగర్, కృష్ణాకాలనీ మీదుగా పెద్దమ్మగడ్డ నాలా వరకు డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లనే ముంపునకు గురయ్యాయని అధికారులు గుర్తించారు. మూడు నెలల తర్వాత డ్రెయినేజీ నిర్మాణం చేపట్టారు. పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఈ ఏడాది మళ్లీ ముంపు తప్పదని ఆందోళన చెందుతున్నారు. -
No Headline
కాజీపేటలో స్ట్రాం వాటర్ డ్రెయినేజీలు ఎటుచూసినా నాలుగు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి. కాజీపేట చౌరస్తా నుంచి ప్రారంభమై రైల్వేకాలనీల మీదుగా బోడగుట్ట శివారులోని నాగులమ్మ చెరువులోకి ఉంటుంది. విష్ణుపురిలో ప్రధాన కాలువ మొదలై సోమిడి పెద్దచెరువు కుంట మీదుగా వడ్డేపల్లి రిజర్వాయర్ కట్ట వరకు మురుగు చేరుతోంది. రహ్మత్నగర్, వెంకటాద్రినగర్ కాలనీల నుంచి ఎఫ్సీఐ మీదుగా కాల్వలు వడ్డేపల్లి చెరువులోకి దారి ఉంది. మురుగు కాల్వలన్నీ చెత్తాచెదారంతోపాటు మట్టితో పూడుకపోయాయి. వాస్తవానికి ఏడాదికి ఒకసారి పూడిక తీయాల్సి ఉంటుంది. కానీ, రెండేళ్ల నుంచి తీయడం లేదు. దీంతో ఎక్కడికక్కడ నీరు నిలుస్తోంది. ప్రతీ వర్షాకాలంలో స్థానికంగా ఉండేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. మురుగు కాల్వల్లో పూడిక తీయాలనే ఆలోచన ఎవరికీ రాకపోవడంతో లోతట్టు ప్రాంతాల్లోని పట్టణవాసులకు కష్టాలు తప్పడం లేదు. వర్షాలు బాగా పడి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు రోజుల తరబడి మునిగితే తప్ప స్పందించే పరిస్థితి లేదు. -
టైర్లే పడవలుగా చేసుకుని..
గతేడాది కురిసిన భారీ వర్షాలకు నగరంలోని 31వ డివిజన్ న్యూశాయంపేట హంటర్రోడ్డు ప్రాంతంలోని విశాల్మార్ట్ వెనకాల గల లోతట్టు కాలనీ వాసులు వరద నీటిలో చిక్కుకున్నారు. సాయం చేసేవారు లేక సొంతంగా కారు టైర్లను, భవన నిర్మాణానికి ఉపయోగించే తట్టను పడవగా ఏర్పాటు చేసుకొని ఈదుకుంటూ బయటికి వచ్చారు. వచ్చే ఏడాదైనా భారీ వర్షాల నుంచి కాపాడాలని అప్పుడు కాలనీవాసులు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. కనీసం వరద ప్రవాహం త్వరగా వెళ్లేలా మురుగు కాల్వలు నిర్మించలేదు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ కాలనీ మొత్తం జలమయమై నీటికుంటను తలపిస్తోంది. -
ఏఆర్ఓలు స్ట్రాంగ్రూంలను పరిశీలించాలి
వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రావీణ్యవరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్రూంలను ఏఆర్ఓలు పరిశీలించాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. ఏనుమాములలోని స్ట్రాంగ్రూంలను కలెక్టర్ గురువారం పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, ఆయా స్ట్రాంగ్రూంల సీసీ టీవీ కవరేజీని ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించి భద్రపరిచిన ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి, స్ట్రాంగ్రూంలకు సంబంధించిన లాగ్బుక్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ వాచ్రూంను కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్రూంలు 24 గంటలు సాయుధ బలగాల రక్షణలో ఉంటాయని, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం కంట్రోల్ రూంలో పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్ట్రాంగ్రూం ఆవరణలో ఎవరికి అనుమతి ఉండదని, అభ్యర్థుల తరఫున వచ్చే ఏజెంట్లకు ప్రత్యేక రూం ఏర్పాటు చేసి స్ట్రాంగ్రూంల సీసీ టీవీ ఫుటేజీలను స్క్రీన్లపై ప్రదర్శించనున్నట్లు వివరించారు. ఆమె వెంట డీటీ రంజిత్, పోలీస్ అధికారులు, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. స్ట్రాంగ్రూం పరిశీలన..వరంగల్ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించిన ఈవీఎంలను భద్ర పర్చిన స్ట్రాంగ్రూంల భద్రతను ఏఆర్ఓ, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే గురువారం పరిశీలించారు. ఎన్నికల సామగ్రి, స్ట్రాంగ్ రూంలకు సంబంధించిన లాంగ్బుక్, సీసీ కెమెరాల పర్యవేక్షణకు సంబంధించిన వాచ్ రూంను పరిశీలించారు. -
మసకబారిన ‘తెర’
సాక్షి, వరంగల్: సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కష్టకాలం వచ్చింది. కరోనాకు ముందు వరకు సరికొత్త సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకున్న ఆ థియేటర్ల తెరలు మసకబారిపోతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మూతబడటమో.. ఫంక్షన్హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్, ఆస్పత్రులు లేదా.. మల్టీప్లెక్స్ థియేటర్లుగా పరివర్తన చెందడమే జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కప్పుడు 70కిపైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లుంటే ఇప్పుడు 40 ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఆ థియేటర్లు కూడా కొత్త సినిమాల విడుదల నిలిచిపోవడంతో శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకు మూసివేయాలని నిర్ణయించారు. షాపింగ్ కాంప్లెక్స్, ఫంక్షన్హాళ్లుగా.. వరంగల్ నగరంలో దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నుంచే పదుల సంఖ్యలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు కొనసాగుతుండేవి. కాలక్రమేణా కొన్ని మూతపడగా.. మరికొన్ని షాపింగ్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాళ్లుగా మారాయి. వరంగల్ రైల్వే గేట్ సమీపంలోని మార్కండేయ టాకీస్ ఆ తర్వాత సరోజ టాకీస్గా మారింది. రాజరాజేశ్వరి థియేటర్ కాలక్రమంలో సునీల్ థియేటర్గా మారింది. పాత బీట్ బజా ర్లోని రామటాకీస్ షాపింగ్ కాంప్లెక్స్గా.. నవీన్ టాకీస్ ఫంక్షన్హాల్గా మారింది. మట్టెవాడలోని కాకతీయ టాకీస్, కాకతీయ సిటీ కాంప్లెక్స్లోని 35 ఎంఎం థియేటర్.. సీతారామాంజనేయ థియేటర్ కొద్ది సంవత్సరాల క్రితం మూతపడ్డాయి. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పక్క వీధిలోని దుర్గా టాకీస్ తర్వాత రామయ్య చిత్రమందిర్గా మారగా కరోనా తర్వాత ఈ థియేటర్ స్థానంలో ఫంక్షన్హాల్ ప్రారంభమైంది. దీనికి సమీపంలోని శ్రీనివాస థియేటర్ 1994లో కూల్చేసి ఆ స్థానంలో రాంలక్ష్మ ణ్ థియేటర్ను ప్రారంభించారు. దీని పక్కనే ఉన్న జెమినీ టాకీస్కు తోడుగా జెమినీ మయూరి 35ఎంఎం ఆ తర్వాత ఏషియన్ జెమినీ థియేటర్గా మారింది. వరంగల్లోని వెంకట్రామ టాకీస్, గిర్మాజీపేటలో రాధిక థియేటర్ నేటికీ వినోదాన్ని అందిస్తున్నాయి. పదేళ్ల క్రితం మూతపడిన ములుగురోడ్డులోని కృష్ణ టాకీస్ ప్రస్తుతం కియా మోటార్స్గా మారింది. వీటికి కొద్ది దూరంలో ఉన్న అలంకార్ టాకీస్కు అనుబంధంగా గీత్ కళామందిర్ థియేటర్లు నిర్వహణ భారం కావడంతో కూల్చేసి ఆ స్థానంలో రిలయన్స్ మార్ట్ నిర్మించారు. ఒకప్పుడు డబ్బా టాకీస్గా పిలిచే హనుమకొండ చౌరస్తాలోని జీఆర్ థియేటర్ కొద్ది సంవత్సరాల క్రితం జీఆర్ కాంప్లెక్స్గా మారింది. విజయ టాకీస్ కాస్త ఏషియన్ విజయ థియేటర్గా మారింది. అయితే ప్రస్తుతం దాని స్థానంలో ఆస్పత్రి కడుతున్నారని వినికిడి. అమృత, అశోక థియేటర్లు ప్రేక్షకులను అలరిస్తుండగా.. కాజీపేటలోని భవాని టాకీస్, శాంభవి టాకీస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అప్పుడు ఫుల్.. ఇప్పుడు డల్ ఒకప్పుడు సినిమా విడుదలైందంటే ప్రేక్షకులు థియేటర్లలో క్యూ కట్టేవారు. హౌస్ఫుల్ కలెక్షన్లు, ప్రేక్షకులకు అదనంగా కుర్చీలు తెప్పించాల్సిన పరిస్థితి ఉండేది. కాలక్రమేణా డిజిటల్ యుగం ఊపందుకోవడంతో ఓటీటీల్లోనే సినిమాలు వచ్చేస్తున్నాయి. దీనికితోడు మల్టీప్లెక్స్లు పెరుగుతున్నాయి. టికెట్ రేట్లు పెరగడం, మాల్స్, మల్టీప్లెక్స్లు పుంజుకోవడంతో వీటిని ఆదరించేవారి సంఖ్య నానాటికి తగ్గుతోంది. ఇటీవల ప్రముఖ హీరోల సినిమాల విడుదల లేకపోవడంతోపాటు చిన్న సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు ప్రతిరోజూ ఓ థియేటర్కు విద్యుత్, ఇతర ఖర్చులు కలుపుకుంటే రూ.20వేల వరకు భారం పడుతోంది. ఆ మేరకు ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో యజమానులు నష్టపోవాల్సిన పరిస్థితి. నష్టం భరించలేక మూత ప్రేక్షకులు రాకపోవడం.. సినిమాలు పెద్దగా రిలీజ్ లేకపోవడంతో నష్టాలు భరించలేక శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తున్నాం. మగధీర సినిమా 50 రోజులు హౌస్ ఫుల్ నడిచింది. ప్రేక్షకుల తాకిడి తట్టుకోలేక అశోక థియేటర్లోనూ ప్రదర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో అలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అంతా శూన్యమైంది. దండిగా సినిమాలు రావడంతోపాటు మరిన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్ల కోసం అనుకూల మార్పులు రావాల్సి ఉంది. – మోహన్రావు, అమృత థియేటర్ మేనేజర్ ఇబ్బందుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు నేటి నుంచి వారం రోజుల విరామం ఇప్పటికే ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్గా మార్పు ఓటీటీల రాకతో మరింత కుంగుబాటు నష్టాలు భరించలేక తాత్కాలిక మూసివేతకు నిర్ణయం -
భద్రకాళి ఆలయంలో రథోత్సవం
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారికి ప్రత్యేకపూజలు, రధాంగ హోమం నిర్వహించి అనంతరం ఉత్సవాంగ బలిప్రదానం జరిపారు. రాత్రి 8 గంటలకు అమ్మవారి ఉత్సవమూర్తిని భద్రకాళి మహాత్రిపుర సుందరిగా అలంకరించి సుపర్ణికాధారురఽథంపై ప్రతిష్ఠించి మంగళవాయిద్యాలతో గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణపదం గుండా వైభవంగా ఊరేగించారు. పూజా కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు, మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు ఆధ్వర్యంలో జరిగాయి. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొనుపునూరి వీరన్న, మల్యాల వీరమల్లయ్య, ప్రోగ్రాం కన్వీనర్ అయితా గోపినాఽథ్, నాగేశ్వరరావు, కల్వ నాగరాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాదాల వితరణ జరిగింది. పాఠశాలల పనుల్లో వేగం పెంచండివరంగల్ అర్బన్ : అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల్లో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. హనుమకొండ జిల్లా పరిధిలోని అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్పర్సన్లు, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనులపై గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న చిన్నచిన్న పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. టీపీఆర్ఓ కోలా రాజేశ్కుమార్, ఈఈలు రాజయ్య, సంజయ్కుమార్, డీఈలు రవికుమార్, సంతోష్బాబు, శివానంద్, అజ్మీరా శ్రీకాంత్, టీఎంసీ రమేశ్ పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమించొద్దు టీఎస్–బీపాస్ భవన నిబంధనలను అతిక్రమించొద్దని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీవాకడే సూచించారు. హనుమకొండ పరిధిలోని బాలసముద్రం, పోస్టల్కాలనీ, ప్రకాశ్రెడ్డిపేట తదితర ప్రాంతాల్లో గురువారం ఆమె పర్యటించి భవన నిర్మాణ అనుమతుల స్థలాలను పరిశీలించారు. -
జూన్ 15 వరకు నాలా పనులు పూర్తి చేయాలి
హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ హన్మకొండ అర్బన్ : నగరంలోని నయీంనగర్ నాలాతోపాటు నాలాపై వంతెన అభివృద్ధి నిర్మాణ పనులు జూన్ 15వరకు పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీవాకడే, అదనపు కలెక్టర్ రాధికాగుప్తాతో కలిసి నాలా పనుల పురోగతి, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తాపట్నాయక్ మాట్లాడుతూ నాలా అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి నాలుగైదు రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. మూడు రోజుల్లో నాలా పనుల సర్వే నిర్వహించాలన్నారు. సర్వే అనంతరం మరోసారి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్, జీడబ్ల్యూఎంసీ ఈఈ రాజ య్య, టౌన్ప్లానింగ్ అధికారి వెంకన్న, ఇరిగేషన్ ఈఈ ఆంజనేయులు, అధికారులు పాల్గొన్నారు. పాఠశాలల్లో పనులు పూర్తికావాలి.. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఈనెల 20లోగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాజీపేట, హనుమకొండ మండలాల్లోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనుల పురోగతిపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పనులు పూర్తయి తే ధ్రువీకరణ పత్రం అందజేయాలన్నారు. సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీవాకడే, అదనపు కలెక్టర్ రాధికాగుప్తా, డీఈఓ అబ్దుల్హై, ఈఈలు రాజయ్య, సంజయ్కుమార్, డీఈలు సంతోష్ బాబు, రవికుమార్, శివానంద్ పాల్గొన్నారు. -
‘ఉద్యోగులకు డీఏ సొమ్ము చెల్లించాలి’
హన్మకొండ: ఉద్యోగులకు రావాల్సిన నాలుగు డీఏల సొమ్ము వెంటనే చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి ప్రభుత్వాన్ని గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ డీఏల విడుదలపై చర్చించాలని పేర్కొన్నా రు. ఒకేచోట 3 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న అన్ని కేడర్ల నాన్ గెజిటెడ్ ఉద్యోగులను సాధారణ బదిలీ చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెమ్యునరేషన్ సమానంగా ఇవ్వలేదని, దీనిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన ఉద్యోగులకై నా సమానంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. బీపీ వ్యాధిగ్రస్తులకు ఉచిత మందులుఎంజీఎం : హనుమకొండ జిల్లాలో 89,708 మంది బీపీ వ్యాధిగ్రస్తులను గుర్తించి, ప్రతినెల 27,411 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. మే 17 ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవాన్ని పురస్కురించుకుని నెల రోజులపాటు అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 30 సంవత్సరాలు పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి వ్యాఽధి నిర్ధారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రోజుకు ఒక్కరు ఐదు గ్రాములకు మించి ఉప్పు వాడకూదని సూచించారు. నడక, వ్యాయామం అలవాటుగా మా రాలని, ఉప్పు తక్కువగా వేసి నిల్వ ఉన్న పచ్చళ్లను తయారు చేయాలని చెప్పారు. బీపీ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని కోరారు. డెంగీపై సమీక్ష సమావేశం.. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో డెంగీ వ్యాధిపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ సాంబశివరావు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, పంచాయతీ, నగరపాలక సిబ్బంది సమన్వయంతో పనిచేసి వ్యాధి ప్రబలకుండా చూడాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కాను న్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని కోరారు. అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, ప్రోగాం అధికారులు ఉమశ్రీ, హిమబిందు, డీపీఓ శ్రీనివాస్, డెమో అశోక్రెడ్డి పాల్గొన్నారు. నైపుణ్యాలు పెంపొందించుకోవాలికేయూ క్యాంపస్ : పోటీ ప్రపంచంలో విజ యం సాధించాలంటే విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నారు. హనుమకొండలోని యూని వర్సిటీ మహిళా పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ సౌజన్య అధ్యక్షతన మ్యాజిక్ ఆఫ్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నవీన నైపుణ్యాలపై దృష్టి సారించాలని సూచించారు. 125 మంది విద్యార్థినులు పాల్గొనగా 80 మందితో షార్ట్లిస్ట్ రూపొందించారు. ఈనెల 17న వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపికై న అభ్యర్ధులు హైదరాబాద్, వరంగల్లో విధులు నిర్వర్తించాలి. అధ్యాపకులు మదుశ్రీ, భాగ్యలక్ష్మి, కవిత, రవీందర్, కుమారస్వామి, ఎస్.జ్యోత్స్న, వి.రజిత, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్డీఎల్సీఈ ఏడీగా గోపీనాఽథ్ కేయూ క్యాంపస్ : కేయూ పరిధిలోని ఎస్డీఎల్సీఈ సైన్స్కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా యూనివర్సిటీలోని మైక్రోబయాలజీ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.వెంకటగోపీనాఽథ్ను నియమిస్తూ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు గురువారం కేయూ వీసీ తాటికొండ రమేశ్ చేతుల మీదుగా ఆయన ఉత్తర్వులు అందుకున్నారు. ఇప్పటివరకు సైన్స్కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించిన బాటనీ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.కరుణాకర్ నుంచి ఈనెల 17న గోపీనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), పింపుల్ ట్రీట్మెంట్, హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు. వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు.. ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం : శ్రీ శైలి బ్యూటీపార్లర్, మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, హనుమకొండ చౌరస్తా, హనుమకొండ. సెల్ : 95055 14424 ఫీజు : రూ.3 వేలు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బద్ధిపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేసవిలో ‘చల్లని’ సేవ
గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివించండి
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బుద్ధ జయంతిని విజయవంతం చేయాలి
ఎప్సెట్ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం
ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకం
నేటి నుంచి జీల్గుల మల్లికార్జునస్వామి ఉత్సవాలు
వ్యానును ఢీకొన్న కారు
తప్పక చదవండి
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
Advertisement