-
‘ఇక రాజకీయాలకు సెలవు’..బీజేపీ నేత కీలక ప్రకటన
లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ హర్ష వర్ధన్ కీలక ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి రీటైరవుతున్నట్లు చెప్పారు. ‘ముప్పై సంవత్సరాలకు పైగా అద్భుతమైన రాజకీయ జీవితం. ఐదు అసెంబ్లీ, రెండు పార్లమెంటరీ ఎన్నికలలో గెలిచాను. పార్టీలో,రాష్ట్రంలో,కేంద్రంలో అనేక కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించాను. ఇప్పుడు తిరిగి వైద్య వృత్తిలో కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ట్వీట్ చేశారు. After over thirty years of a glorious electoral career, during which I won all the five assembly and two parliamentary elections that I fought with exemplary margins, and held a multitude of prestigious positions in the party organisation and the governments at the state and… — Dr Harsh Vardhan (@drharshvardhan) March 3, 2024 మానవాళికి సేవ చేయాలనే నినాదంతో నేను యాభై ఏళ్ల క్రితం కాన్పూర్లోని జీఎస్వీఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో చేరాను. కోవిడ్-19 మహమ్మారి వంటి కఠిన సమయాల్లో ప్రాణాలతో పోరాడుతున్న లక్షల మంది ప్రజల్ని ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం నాకు దక్కింది. ఇప్పుడు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఢిల్లీ కృష్ణా నగర్లోని నా ఈఎన్టీ క్లీనిక్లో వైద్య సేవలందిస్తా. నాకోసం క్లీనిక్ ఎదురు చూస్తోంది అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. -
అలాంటి నేతలకు ‘నో టికెట్’.. బీజేపీ స్ట్రాటజీ ఇదే
సాక్షి, న్యూఢిల్లీ : ఈ సారి లోక్సభ ఎన్నికల్లో 370 పై చిలుకు స్థానాల్లో నెగ్గాలని బీజేపీ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. అందుకు తగ్గట్లే లోక్సభ అభ్యర్ధుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గెలుపు గుర్రాల్ని రంగంలోకి దించుతుంది. కేరాఫ్ కాంట్రవర్సీ అభ్యర్ధుల్ని పక్కన పెట్టేస్తోంది. తాజాగా బీజేపీ విడుదల చేసిన తొలి లోక్సభ అభ్యర్ధుల జాబితాలో మొత్తం 33 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు టికెట్లను తిరస్కరించింది. కొత్త వారికి అవకాశం కల్పిచ్చింది. వారిలో ప్రగ్యా ఠాకూర్, రమేశ్ బిధూరి, పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మలు ఉన్నారు. ఈ ముగ్గురు ఎంపీలు పార్లమెంటు లోపల, వెలుపల ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. కాబట్టే పార్టీ పెద్దలు కఠిన చర్యలు తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ భోపాల్ నుంచి వివాదాస్పద ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్లకు మొండిచేయి చూపింది బీజేపీ. ఆమె స్థానంలో అలోక్ శర్మకు చాన్స్ ఇచ్చింది. సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్పై గతంలో అనేక వివాదాలున్నాయి. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు,నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అని వ్యాఖ్యానించడం, 2008 ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే గురించి చేసిన కామెంట్లు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. ఇలా సాధ్వీ సున్నితమైన అంశాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కమలం పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ఫలితం లోక్సభ సీటును తిరస్కరించింది. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ రెండుసార్లు ఎంపీగా పనిచేసిన మాజీ సీఎం దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మకు టికెట్ ఇవ్వలేదు. 2020 ఢిల్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఓ బహిరంగ సభలో ఓ వర్గాన్ని పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆ వ్యాఖ్యలే ఆయన సిట్టింగ్ ఎంపీ సీటుకు ఎసరు పెట్టాయి. రమేష్ బిధూరి లోక్సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ సందర్భంగా ఎంపీ డానిష్ అలీపై ఎంపీ దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరి అనుచిత, మతపరమైన వ్యాఖ్యలను ఉపయోగించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. ఎంపీ బిధూరీ వ్యాఖ్యల పట్ల బీజేపీ పెద్దలు నోటీసులు జారీచేసింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పినా ఫలితం లేకపోయింది. చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. బీజేపీ విడుదల చేసిన తొలి లోక్సభ అభ్యర్ధుల జాబితాలో స్థానం కోల్పోయారు. -
కుదిరిన సంధి.. త్వరలో మహారాష్ట్ర విపక్షాల లోక్సభ సీట్ల ప్రకటన
సాక్షి, ముంబై : అధికార బీజేపీ లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించింది. రికార్డ్ స్థాయిలో మొత్తం 195 మందితో తొలి విడుత అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఇక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సైతం లోక్సభ సీట్ల జాబితా విడుదలపై కసరత్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో ప్రతిపక్షాల కూటమి మహావికాస్ అఘాడీలో సీట్ల సర్దుబాటుపై చర్చించింది. ఆ అంశం కొలిక్కి వచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మొత్తం 48 లోక్సభ స్థానాలకు గాను ఉద్ధవ్ ఠాక్రే శివసేన(UBT) 20 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 18, శరద్పవార్ ఎన్సీపీ 10 చోట్ల అభ్యర్థులను బరిలో దించనుందని సమాచారం. కొద్దిరోజుల క్రితం వరకు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మహరాష్ట్ర ప్రాంతీయ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడి (VBA) మొత్తం ఐదు సీట్లను డిమాండ్ చేసింది. అయితే, తాజాగా ప్రతిపక్షాల కూటమి మహావికాస్ అఘాడీలో వీబీఏకి రెండు సీట్లు కేటాయించింది. శివసేన ముంబైలోని ఆరు లోక్సభ స్థానాలకు గాను నాలుగింటిలో పోటీ చేస్తుండగా.. రాష్ట్రంలోనే 14 శాతం ఓటు షేర్ ఉన్న వీబీఏ ముంబై నార్త్ ఈస్ట్ సీటు దక్కించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచన. పోటాపోటీ ఇక ముంబై సౌత్ సెంట్రల్, నార్త్ వెస్ట్ 39 అసెంబ్లీ స్థానాలకు సీట్ల కేటాయింపుపై స్పష్టం వచ్చినట్లు సమాచారం. ఈ రెండు ప్రాంతల్లో ఎక్కువ శాతం సీట్ల కోసం ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, శివసేనలు పోటీపడుతున్నాయి. 2019లో ఎవరెన్ని గెలిచారంటే 2019 ఎన్నికలలో శివసేన (అప్పుడు బీజేపీతో పొత్తులో ఉంది) 23 స్థానాల్లో పోటీ చేసింది. ముంబై సౌత్ సెంట్రల్, నార్త్ వెస్ట్ సహా 18 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసి చంద్రాపూర్లో మాత్రమే గెలిచింది, శరద్ పవార్ ఎన్సీపీ 19 స్థానాల నుండి పోటీ చేసి నాలుగు గెలుచుకుంది. -
భంగపాటు తప్పదా !
భద్రాచలం, న్యూస్లైన్ : ఒక్కసారైనా భద్రాచలం పీఠాన్ని దక్కించుకోవాలనే టీడీపీ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఆ పార్టీ అగ్రనాయకుల వ్యవహార శైలితో కేడర్లో పూర్తిగా నిరుత్సాహం ఏర్పడింది. దీంతో మండల స్థాయిలో ప్రచార బాధ్యతలు చేపట్టేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావటం లేదు. గ్రామాల్లో అయితే పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కార్యకర్తలే కరువయ్యారు. ఆ పార్టీకి కొంత కేడర్ ఉన్నప్పటికీ డివిజన్ స్థాయిలో ఆధిపత్యం కోసం పార్టీ నాయకులు తరచూ కుమ్ములాడుకోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో భద్రాచలంలో నడిరోడ్డుపైనే నాయకులు ముష్టి యుద్ధాలకు దిగారు. పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న తమలాంటి వారిని యశోద రాంబాబు చిన్నచూపు చూస్తున్నారంటూ ఇటీవల అర్ధరాత్రి వేళ ఆ పార్టీ కార్యాలయం ఎదుటే అతని అనుచరులు హల్చల్ చేశారు. వారం క్రితం భద్రాచలం మండలంలోని పలు గ్రామాల ముఖ్య కేడర్ అంతా యశోద రాంబాబు వ్యవహారశైలిపై పార్టీ అభ్యర్థి ఫణీశ్వరమ్మకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో మాట ఇచ్చిన తప్పిన ఆయన గ్రామాల్లోకి వస్తే ఓట్లు వేసేది లేద ంటూ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం పార్టీ కార్యాలయం ముందు హల్చల్ చేసిన నాయకులు ఏకంగా కార్యాలయానికి తాళాలు కూడా వేశారు. దీంతో ఆ పార్టీ కేడర్లో పూర్తిగా నిస్తేజం ఏర్పడింది. గత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, సీపీఎం తర్వాత మూడో స్థానంలో నిలిచిన టీడీపీకి ప్రస్తుతం గ్రామాల్లో పూర్తిగా పట్టు తగ్గింది. వెంకటాపురం, చర్ల, భద్రాచలం, కూనవరం మండలాల్లో వర్గపోరు ఉంది. వ్యతిరేక వర్గాన్ని దెబ్బకొట్టేందుకు వేరే పార్టీకైనా ఓట్లు వేయించేందుకు సిద్ధమేనని అక్కడి నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని మండలాల్లో టీడీపీ ప్రచారంలో మిగతా పార్టీల కన్నా పూర్తిగా వెనుకబడిపోయింది. ఫణీశ్వరమ్మకు టికెట్టుపై తమ్ముళ్ల ఆగ్రహం : భద్రాచలం నియోజకవ ర్గంలోని పార్టీ కార్యకర్తలకు ఏనాడూ అందుబాటులో లేని ఫణీశ్వరమ్మకు అధిష్టానం టికెట్టు కట్టబెట్టడంపై స్థానిక నాయకుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. టికెట్టు తమకే వస్తుందని ఆశతో ఎంతో కాలంగా పార్టీ అభివృద్ధి కోసమని పనిచేస్తున్న వాజేడుకు చెందిన బోదెబోయిన బుచ్చ య్య, చర్లకు చెందిన ఇర్పా శాంత, కూనవరానికి చెందిన సీనియర్ నాయకుడు సోడే రామయ్య భారీగానే ఆశలు పెట్టుకున్నారు. వీరంతా ఆయా మండలాల్లో మంచి పట్టుఉన్న నాయకులే. అయితే మూడు సార్లు ఎంపీగా గెలిచి, ఒక సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేత సోడె రామయ్యను ప్రచారం లో విస్మరించారు. హైదరాబాద్లోనే ఉంటూ పార్టీ అధినేతను ప్రసన్నం చే సుకున్న ఫణీశ్వమ్మ బరిలో నిలవటంతో ఆశావాహులంతా నిరుత్సాహంలో పడిపోయారు. బోదెబోయిన బుచ్చయ్య వంటి నాయకులు రెబల్గా పోటీ చేసేందుకు నామినేషన్ వేసినప్పటికీ, చివరకు మొత్తబడి విరమించుకున్నారు. అయితే ఫణీశ్వరమ్మకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించటం లేదని పరిశీలకులు అంటున్నారు. అధిష్టానం మాట చెవికెక్కేనా : భద్రాద్రి తమ్ముళ్ల కుమ్ములాట తారాస్థాయికి చేరటంతో తెలంగాణ జిల్లాల పరిశీలకులు మండవ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రచారంలో తీవ్రంగా వెనుకబడిన ఇక్కడి నాయకత్వంపై తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి దిద్దుబాటు చేస్తున్న సమయంలోనే ఇరువురు నాయకులు వాదులాటకు దిగారు. ఇది చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునేంత వరకూ వెళ్లింది. దీంతో తేరుకున్న జిల్లా నాయకత్వం పార్టీని గాడిలో పెట్టేందుకు తోటకూర రవిశంకర్కు ప్రచార బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా యశోద రాంబాబుకు కూడా దీనిలో భాగస్వామ్యులను చేశారు. అయితే అధిష్టానం మాట భద్రాద్రి టీడీపీ తమ్ముళ్లు చెవికెక్కించుకుంటారా..?అనేది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ..
జగనన్న ప్రభుత్వంలో ప్రజలే పాలకులు
ఎన్నికల తర్వాత టీడీపీ శాశ్వతంగా కనుమరుగు
వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్దం
వైఎస్ జగన్తోనే సంక్షేమాభివృద్ధి సాధ్యం
న్యాయవాదులను ఆదుకున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
సామాజిక న్యాయం అమలు చేస్తున్న జగనన్న
మహిళ కడుపు నుంచి 14 కిలోల కణితి తొలగింపు
ఐదేళ్ళలో చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది
జిల్లాకు క్యూఆర్టీ పోలీస్ బృందాలు
తప్పక చదవండి
- మథర్స్ డే వెనకాల మనసును కథలించే కథ!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- Weekly Horoscope: ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు
- అమ్మా... నా పేరు గుర్తుందా?
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు.. 300 మందికి పైగా మృతి
- ‘ప్లేఆఫ్స్’కు కోల్కతా
- AP: వ్యవసాయం పండగ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement