ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ఒకరి మృతి

Published Fri, Mar 20 2015 2:30 PM

1 died, 20 injured in road accident

ఒంగోలు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు  మృతి చెందగా 20మంది గాయపడ్డారు. వివరాలు..జాతీయ రహదారిపై శ్రీశైలం వెళుతున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement