సాక్షి, ద్వారకా తిరుమల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 165వ రోజు షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం పావులూరివారి గూడెం నైట్క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజుపాలెం, మారం పల్లి, ఘంటావారి గూడెం మీదుగా దూబచెర్ల చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు.
పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి పుల్లలపాడు క్రాస్, నల్లజెర్ల చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర : జననేత వైఎస్ జగన్ పాదయ్రాత 164వరోజు ముగిసింది. గురువారం గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం నైట్క్యాంప్ నుంచి రాజపంగిడి గూడెం, సూర్యచంద్రరావు పేట, గొల్లగూడెం, తిరుమలపాలెం మీదుగా పావులూరివారి గూడెం వరకూ వైఎస్ జగన్ పాదయాత్ర సాగింది. నేడు 15.6 కిలోమీటర్లు నడిచిన మొత్తం 2,051.6 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.