రెండు బైక్‌లు ఢీ : నలుగురికి గాయాలు | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ : నలుగురికి గాయాలు

Published Sun, Aug 30 2015 8:18 AM

4 injured in road accident

తలపుల (అనంతపురం జిల్లా) : వేగంగా వెళ్తున్న రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా తలపుల మండలం గంజివారిపల్లె గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు తలపుల మండలం అగ్రారంపల్లి, చక్రాయపేట మండలం మహదేవపల్లి గ్రామానికి చెందిన వారిగా సమాచారం. గాయపడిన వారిని 108లో కదిరి ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement