ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) : జంగారెడ్డిగూడెంలో శనివారం సాయంత్రం ఐదుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి భారీ ఎత్తున బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. వెంకటరమణ, సుంకర పవన్ కుమార్, హరీష్, ఎస్కే అహ్మద్, లాగు రాజేష్ అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి జిల్లాలోనే పలు పట్టణాల్లో పగటి పూట చోరీలు చేసేవారని చెప్పారు. జంగారెడ్డిగూడెం బస్టాండులో వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి 57 కాసుల బంగారు నగలు, పావు కేజీ వెండి నగలు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.
Breadcrumb
Related news
-
Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
పటమట(విజయవాడతూర్పు): తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ ధారావత్ శ్రీనివాస్(40) ఘటన విజయవాడ నగరంలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. చిరకాల స్వప్నమైన ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే దాన్ని వదులుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన అతను తాను అల్లారుముద్దుగా సాకుతున్న ఇద్దరు పిల్లలు, తనతో జీవితాన్ని పంచుకున్న భార్యను, తనను పెంచి పెద్ద చేసిన తల్లిని హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం విజయవాడ గురునానక్ నగర్లో జరిగింది. శ్రీనివాస్ అన్న దుర్గాప్రసాద్ పటమట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన విజయవా డ పోలీస్ కమిషనర్ రామకృష్ణ, డీసీపీ అదిరాజ్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కథనం మేరకు.. విజయవాడ గురునానక్ నగర్లోని మారుతీ కో– ఆపరేటివ్ కాలనీలో ప్లాట్ నంబరు 53లోని భవనంలో నివసించే ధారావత్ శ్రీనివాస్ గుంటూరులో వైద్య విద్య అభ్యసించారు. అనంతరం విజయవాడలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేశారు. సొంత ఆస్పత్రి ప్రారంభించాలని కలలు కన్నారు. ఈ క్రమంలో తన సేవింగ్స్తోపాటు ఓ ప్రైవేటు బ్యాంక్ నుంచి లోను తీసుకుని ఇటీవల సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో యంత్రపరికరాలు ఏర్పాటు చేసేందుకు డాక్టర్ ధారవత్ శ్రీనివాస్ స్నేహితులైన నగరంలోని ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు వైద్యులు అప్పులు ఇచ్చారు. దీంతో అప్పులు రూ.3 కోట్లకు చేరాయి. బ్యాంకు రుణం, స్నేహితుల వద్ద చేసిన అప్పులతో ఆస్పత్రి నడుపు తున్నా అనుకున్నంత స్థాయిలో ఆదాయం రావడంలేదు. అదే సమయంలో తామిచ్చిన అప్పులు తీర్చాలని స్నేహితులు ఒత్తిడి చేశారు. అప్పు కింద ఆస్పత్రి లో 90 శాతం వాటాను వారు సొంతం చేసుకున్నారు.వారం క్రితమే దారుణానికి వ్యూహం తన ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారడంతో తానే ప్రాణంగా జీవిస్తున్న తల్లి, భార్య, పిల్లలు అనాథలవుతారని డాక్టర్ శ్రీనివాస్ భావించారు. వారి ప్రాణాలు తీసి, ఆత్మహత్య చేసుకోవా లని భావించారు. ఏప్రిల్ 25వ తేదీన గురునానక్ నగర్లోని సూపర్ మార్కెట్కు వెళ్లి రెండు చాకులు కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రపోతున్న తల్లి రమణమ్మ (65), భార్య ఉషా (38), కూతురు శైలజ (11), శ్రీహాన్ (6) మెడపై కత్తితో గాట్లు పెట్టి హత్య చేశారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటిలో ఉన్న కొంత నగదు, నగలు, ఆస్తి తాలూక డాక్యుమెంట్లను ఓ బ్యాగులో సర్ది దానిని కారులో పెట్టారు. అనంతరం ఎదురింటి గేటుకు ఉన్న డబ్బాలో తన అన్న దుర్గాప్రసాద్కు రాసిన లెటరు, తన కారు తాళం చెవిని అందులో వేశారు. తిరిగి తన ఇంటికి వచ్చి వరండాలో ఉరివేసుకున్నారు.తన వాట్సాప్కు వాయిస్ మెసేజ్ ఆత్మహత్య చేసుకునే ముందు డాక్టర్ శ్రీనివాస్ తన వాట్సాప్ నంబరుకు వాయిస్ మెసేజ్ పెట్టుకున్నారు. తన పరిస్థితికి తానే కారణమని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసు కుంటున్నానని పేర్కొన్నారు. తాను లేకపోతే తన కుటుంబ సభ్యులు అనాథలు అవుతారన్న భయంతో వారిని కూడా హతమార్చుతున్నానని ఆ మెసేజ్లో వివరించారు. క్లూస్ టీంతో ఆధారాల సేకరణ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణాలపై విచారణ చేపట్టిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ డాగ్స్కా్వడ్, క్లూస్ టీంను రప్పించారు. శ్రీనివాస్ హత్యకు వినియోగించిన చాకులు, దాని బిల్లు, సూపర్ మార్కెట్ సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు డాక్టర్ శ్రీనివాసే కుటుంబ సభ్యులను హత్యచేశాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.మోసాన్ని జీరి్ణంచుకోలేక..! ఆర్థోపెడిక్ సర్జన్గా విజయవంతంగా కొనసాగు తున్న శ్రీనివాస్కు సొంతగా ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నది కల. ఆ మేరకు సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ను ప్రారంభించారు. దాని నిర్వహణ కోసం స్నేహితులు అప్పులు ఇచ్చారు. ఆ అప్పులు తీర్చాలని ఒత్తిడిచేసి చివరకు ఆస్పత్రిలో 90 శాతం వాటా రాయించుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోనే పనిచేయాలని శ్రీనివాస్ను ఒత్తిడిచేశారు. దీంతో మనస్తాపం చెంది శ్రీనివాస్ తల్లి, భార్య, పిల్లలను హత మార్చి ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ తండ్రి జమలయ్య నాయక్ విజయవాడ తూర్పు ఏసీపీగా పనిచేశారు. అతని అన్న నల్గొండ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్ అత్తింటి వారు కూడా ఆర్థికంగా స్థితి మంతులే. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణానికి తీర్చలేనంత అప్పులు కారణం కాదని, తన స్నేహితులే మానసిక క్షోభకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. -
వంట సరిగా చేయలేదని.. భార్యను చంపిన భర్త
నిజాంపేట్: వంట రుచిగా చేయలేదని ఓ వ్యక్తి భార్యతో గొడవపడి ఆమెను హతమార్చిన సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నవీన్ దుర్వే, రవీనా దుర్వే(28) నగరానికి వలస వచ్చి బాచుపల్లిలోని వెనుక ఉన్న ప్రగతి కన్స్ట్రక్షన్స్లో కార్మికులుగా పనిచేస్తూ గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. సోమవారం రాత్రి వంట విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. వంట సరిగా చేయడం లేదని ఆగ్రహానికి లోనైన నవీన్ ఇటుకతో భార్య రవీనా తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నవీన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మసాజ్ పేరుతో అసహజ ప్రవర్తన
సనత్నగర్: థెరపిస్టుల ముసుగులో ఇద్దరు మహిళలు ఓ వ్యక్తిపై ‘అసహజ’ దాడికి యత్నంచడంతో పాటు అతడిని నగ్నంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెది రింపులకు దిగారు. దీంతో బాధితుడు భయ పడి రూ.20 వేలు ఇచ్చాడు. కానీ.. మరో రూ.30 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇన్స్పెక్టర్ పురేందర్రెడ్డి తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.. సనత్నగర్కు చెందిన ఓ వ్యక్తికి తనకు తానుగా థెరపిస్టుగా చెప్పుకున్న ఓ మహిళ పరిచయమైంది. ఆమె ద్వారా భరత్నగర్కు చెందిన మరో మహిళ ఫోన్ నంబర్ను తీసుకుని మాట్లాడాడు. తాము థెరపిస్టులమని, మసాజ్ చేస్తామంటూ సదరు వ్యక్తితో నమ్మబలికారు. దీంతో అతడు ఆ ఇద్దరు మహిళలు చెప్పిన్నట్లుగా భరత్నగర్లోని వారి ఇంటికి వెళాఉ్లడు. అయితే.. పరిస్థితులపై అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని భావించాడు. అతడు బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే ఇద్దరు మహిళలు బలవంతంగా నిర్బంధించారు. అతడి ఒంటిపై దుస్తులు తీసి లైంగిక దాడికి యత్నంచారు. ఈ క్రమంలోనే నగ్న వీడియోలు తీశారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన ఆ వ్యక్తి రూ.20 వేలు ఆన్లైన్ ద్వారా వారికి ఇచ్చాడు. వారి బారి నుంచి బయటపడ్డానని భావిస్తున్న క్రమంలోనే మళ్లీ ఓ మహిళ ఫోన్ చేసి రూ.30 లక్షలు ఇవ్వాలని, లేకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించింది. దీంతో బాధితుడు సనత్నగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను మంగళవారం ఆయన విడుదల చేశారు.ఆ వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేటలోని సూర్య మహల్ సెంటర్లో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
విజయవాడలో విషాదం.. డాక్టర్ ఘాతుకం.. కుటుంబ సభ్యుల్ని చంపి తానూ..
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడలోని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని.. ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో డాక్టర్ శ్రీనివాస్, ఆయన తల్లి, భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ల మృతికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన శ్రీనివాస్.. ఏడాది క్రితం శ్రీజ అనే ఆస్పత్రిని విజయవాడలో ప్రారంభించాడు. అయితే ఆ ఆస్పత్రి సరిగా నడవటం లేదు. దీంతో ఆయన డిప్రెషలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రిని రెండు నెలల కిందట మరొకరికి అప్పగించనట్లు తెలుస్తోంది.మంగళవారం ఉదయం గురునానక్ నగర్లోని ఇంట్లో శ్రీనివాస్ కుటుంబం విగత జీవిగా కనిపించింది. ఇంటి ఆవరణలో శ్రీనివాస్ మృతదేహాం కొయ్యకు వేలాడుతూ కనిపించింది. దీంతో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా? లేదంటే ఎవరైనా హత్య చేశారా?.. తాను ఆత్మహత్య చేసుకుని, అంతకు ముందు కుటుంబ సభ్యుల్ని శ్రీనివాస్ హత్య చేసి ఉంటాడా? అనే అనుమానాలు రేకెత్తాయి. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఉషారాణి (36), శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)ఘటనా స్థలాన్ని సీపీ రామకృష్ణ పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీలు జరిపాయి. అయితే.. తన కారు తాళం తన అన్నకు ఇవ్వాలంటూ ఎదురింటి వాళ్ల పోస్ట్ బాక్స్లో డాక్టర్ శ్రీనివాస్ పేరిట ఒక లెటర్ దొరికింది. దీంతో ఇది సూసైడ్ కేసు అయ్యి ఉంటుందని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అర్ధరాత్రి టైంలో కుటుంబ సభ్యులను చంపి, తెల్లవారుజామున శ్రీనివాస్ తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్థారించుకున్నారు.శ్రీనివాస్ చాలా సౌమ్యుడు.. ఎవరితోనూ విబేధాలు లేవు. సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హస్పటల్ సక్రమంగా నిర్వహించాడు.తరువాత హాస్పటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే చనిపోయాడని భావిస్తున్నాం. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాం.:::సాక్షిటీవీతో డాక్టర్ శ్రీనివాస్ స్నేహితులు
Related News by category
-
ఫేక్ వీడియోకున్న విలువ.. సీఎం జగన్ ప్రాణానికి లేదా?
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు పబ్లిక్గా ఏపీ సీఎం జగన్ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్, YSRCP నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం ఉదయం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో రోజులుగా సీఎం జగన్ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ‘రేపే నిన్ను(సీఎం జగన్ను ఉద్దేశిస్తూ..) చంపితే ఏం చేస్తారు’ అని చంద్రబాబు అడుగుతున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో దాడి జరిగితే మీరే చేపించుకున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇది దుర్మార్గం కాదా?. దీనిపై ఎవరూ స్పందించరా?. ఒక ఫేక్ వీడియోకి ఉన్న విలువ సీఎం జగన్ ప్రాణానికి లేదా?.. సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఆర్థిక నేరస్తులు. ఈ విషయం అందరికీ తెలుసు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారారు? బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా? అక్రమాలు చేసిన వాళ్లు బీజేపీలో ఉంటే శిక్ష పడదా?. మోదీగారు మీరు నిజాయితీవంతమైన నాయకులు. ఇలాంటి వారిని ప్రొత్సహించి మీ ఇమేజ్ను దెబ్బ తీసుకోకండి’’ అని పోసాని అన్నారు. -
చంద్రబాబు, పవన్కు పొలిటికల్ ట్విస్ట్.. బీజేపీ కీలక ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఎన్నికల వేళ కూటమిలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ, జనసేనకు బీజేపీ ఊహించని షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ కట్టుబడి ఉంటుందని.. తెలుగుదేశం, జససేన నిర్ణయాలకు అనుకూలంగా ఉండలేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది.ఇక, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ మరోసారి పునర్ఘటించింది. ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దుకే కట్టుబడి ఉన్నామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో.. టీడీపీ, జనసేన నిర్ణయాలకు తాము అనుకూలంగా లేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది. Truth: If BJP comes into power, we will make an end of the unconstitutional Muslim reservations. Meanwhile it's the right of SC, ST & OBC people of Telangana. We will ensure them that they get it. Therefore, We will end the Muslim Reservations.Fake Video: If BJP comes to power,… pic.twitter.com/4OxR8LP9Z9— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 30, 2024బాబును నమ్మని బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు.అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్సింగ్ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు. -
కృష్ణమ్మ తీరం విజయహారం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రగతి పరుగులు పెడుతోంది. విజయవాడను సుందరంగా తీర్చిదిద్దడంతో కృష్ణా నదీతీరం, దుర్గ గుడి, ప్రకాశం బ్యారేజీలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంబేడ్కర్ స్మృతివనం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరోవైపు మెగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, జగనన్న కాలనీలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మూలపాడు వద్ద బటర్ఫ్లై పార్కును అందంగా తీర్చిదిద్ది 150 రకాల ఔషధ మొక్కలు పెంచుతున్నారు. కొండపల్లి బొమ్మల పరిశ్రమ అంతరించిపోకుండా వాటి తయారీదారులకు చేయూతనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బందరులో అత్యధిక జనాభా ఆధారపడి పనిచేసే రోల్డ్గోల్డ్ పరిశ్రమకు ప్రోత్సాహం కలి్పస్తున్నారు. అక్కడి ప్రజల చిరకాల కోరిక పోర్టు నిర్మాణం కల నెరవేరనుంది. గిలకలదిండిలో మత్స్యకారులకు ఉపాధి కలి్పంచేందుకు హార్బర్ నిర్మాణం పూర్తి కావస్తోంది. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయి 150 మంది విద్యార్థులతో తరగతులు జరుగుతున్నాయి. రుద్రవరంలో కృష్ణా యూనివర్సిటీ భవనాలు నిర్మాణం పూర్తి చేసుకొని కార్యకలాపాలు జరుగుతున్నాయి. విశాఖ బీచ్ తరహాలో ఆహ్లాదకరమైన వాతావరణం కలి్పంచేందుకు బందరు బీచ్లో రిసార్ట్స్, పార్కులు, గేమ్ జోన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.రహదారులు.. అదరహో ⇒విజయవాడ బెంజిసర్కిల్ జంట ఫ్లై ఓవర్లు అందుబాటులోకి ⇒కృష్ణా నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి కావడంతో తప్పిన ముంపు సమస్య ⇒వెస్ట్ బైపాస్ పనులు వేగంగా సాగుతున్నాయి తూర్పు బైపాస్ ప్రతిపాదనలకు తుది రూపు⇒జాతీయ రహదారి మొత్తం 17,761 మీటర్ల పొడవున 18 రహదారుల డివైడర్లను హరిత హారాలుగా తీర్చిదిద్దారు. ⇒నగరంలో 16 పార్కులను అభివృద్ధి చేశారు. ఎయిర్పోర్టు కారిడార్కు రూ.17 కోట్లతో తుదిరూపు ⇒మిషన్ క్లీన్ కృష్ణా కింద నదీ తీరాన్ని శుభ్రం చేశారు. నగరంలోని ప్రధాన కాలువల్లో బోటింగ్కు సన్నాహాలు ⇒కనకదుర్గా నగర్ గోశాల వద్ద రూ.216.05 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన, రూ.23.145 కోట్లతో పూర్తి చేసిన పనులు ప్రారంభం ⇒ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో రూ.102 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు రూ.62 కోట్లతో మున్నేరు కాల్వలఆధునికీకరణ పనులు ⇒ విజయవాడలో కాలువలపై రూ.31 కోట్లతో ఏడు బ్రిడ్జిల నిర్మాణం ⇒ జిల్లాలో తొలి విడతలో 1.07 లక్షల మందికి ఇళ్లు మంజూరు.. ⇒ వాటిలో 14,935 ఇళ్ల నిర్మాణం పూర్తి ⇒ కాల్వ గట్టు, ప్రభుత్వ స్థలాలు, రోడ్ల పక్కన నివాసం ఉండే వారిని తొలగించి వాంబే కాలనీలో ఇళ్లు కేటాయింపు ⇒ పటేల్నగర్, ప్రకాష్నగర్, వడ్డెరకాలనీ, నందావరి కండ్రిక ప్రాంతాల్లో గతంలో 13,915 ఇళ్లు నిర్మించి కొన్నింటినే రిజి్రస్టేషన్ చేశారు ⇒ జలజీవన్ మిషన్ కింద 77,123 గృహాలకు నీరు అందించేందుకు రూ.77.9 కోట్లు ఖర్చు చేశారు అంబేడ్కర్ స్మృతివనం అద్భుతం⇒ నగరాభివృద్ధికి చేసిన ఖర్చు – రూ.1,383 కోట్లు ⇒అంబేడ్కర్ స్మృతివనం కోసం చేసిన ఖర్చు– రూ.400 కోట్లు ⇒ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు– రూ.239.19 కోట్లు ⇒ జీజీహెచ్లో నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులకు– రూ.170 కోట్లు ⇒ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం కోసం – రూ.150 కోట్లు ⇒ కృష్ణా నది రక్షణ గోడ నిర్మాణం కోసం చేసిన ఖర్చు – రూ.394.27 కోట్లు ⇒బెంజి సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ పొడవు– 2.27 కి.మీ ⇒ దాని నిర్మాణానికి చేసిన ఖర్చు– రూ.80 కోట్లు ⇒ బెంజి సర్కిల్ రెండవ ఫ్లైఓవర్ పొడవు – 1.703 కి.మీ ⇒ దాని నిర్మాణానికి చేసిన ఖర్చు – రూ.96 కోట్లు ⇒బెంజిసర్కిల్ వెస్ట్, ఈస్ట్ సైడ్ సరీ్వస్ రోడ్లకు ఖర్చు చేస్తున్న మొత్తం : రూ.40 కోట్లు ⇒ గన్నవరం విమానాశ్రయం హాఫ్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చేసిన ఖర్చు –రూ.23.75 కోట్లు ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యసేవలు విజయవాడ జీజీహెచ్లో కార్డియోథోరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిరి్మంచారు. అత్యాధునిక క్యాథ్ల్యాబ్, ఎంఆర్ఐ స్కాన్, 120 స్లైస్ సీటీ స్కాన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం వైఎస్ జగన్ సీఎం కాగానే రూ.30 కోట్లు విడుదల చేశారు. రూ.170 కోట్లతో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలకు రూ.437 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలోని ఏ కొండూరు మండలంలోని గిరిజన తండాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగుల కోసం రూ.40 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ఏ కొండూరు పీహెచ్సీలోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి నెలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అర్హులైన వారికి రూ.10 వేల పింఛన్ ఇస్తున్నారు. పురోగతిలో బెజవాడ బైపాస్ పనులు ప్యాకేజీ–3 చిన్న అవుటుపల్లి –గొల్లపూడి పొడవు: 30 కి.మీ ⇒ దీనికోసం ఖర్చు చేస్తున్న మొత్తం: రూ.1,148 కోట్లు ప్యాకేజీ–4 ⇒ గొల్లపూడి–చినకాకాని – 17.88 కి..మీ ⇒ కృష్ణా నదిపై ఆరువరుసల బ్రిడ్జి పొడవు– 3.12 కి.మీ ⇒ దీనికోసం ఖర్చు చేస్తున్న మొత్తం రూ.757 కోట్లు ⇒ ఈస్ట్ బైపాస్ ప్రతిపాదనలు ⇒ బైపాస్ పొడవు: 49.3 కి.మీ ⇒ కృష్ణా నదిపై నిర్మించే బ్రిడ్జి పొడవు – 3.750 కి.మీ ⇒ అంచనా వ్యయం మొత్తం –రూ.4,607.80 కోట్లు -
వైఎస్ జగన్... ఆ పేరే ఓ స్ఫూర్తి...
సాక్షి, అమరావతి: ‘పేదలు ఎదగాలంటే ప్రభుత్వ సాయం కావాలి. అందుకు సంక్షేమ పథకాలు చాలా వరకూ తోడ్పడతాయి. ఒక వైపు సంక్షేమం... మరోవైపు అభివృద్ధి ఏపీలో సమపాళ్లలో జరుగుతోంది. అందుకు కారకుడైన జగన్ అంటే అందుకే నాకు ప్రత్యేకమైన అభిమానం’ అంటున్నారు సినీ నటుడు రాజా రవీంద్ర. వ్యక్తిగతంగా తనకే కాదు చాలా మందికి ఆయన ఇన్స్పిరేషన్ అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన పట్ల తన అభిప్రాయాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..పేదలు ఎదగాలంటే...ప్రభుత్వ ఆసరా కావాలి.. పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలు ఎదగాలంటే మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతికి చేరాలంటే అది వారి కాయకష్టం మీద అయ్యేపని కాదు. కాబట్టి తప్పకుండా సంక్షేమ పథకాలు అవసరమవుతాయి. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలు రూపాల్లో ఆసరా అందిస్తోంది.అన్నివర్గాల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే వారికి ప్రభుత్వం తప్పనిసరిగా అందివ్వాల్సింది విద్య, వైద్యం. ఈ విషయంలో చాలా మార్పులు జరిగాయి.దళారీలు లేకుండా చేరుతున్న లబ్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో గ్రామ వలంటీర్ల విధానం చాలా మంచి కాన్సెప్్ట. వీరి వల్ల మధ్యలో ఎవరికీ ఎటువంటి లంచాలు, పైరవీలతో తావు లేకుండా పేదలకు పథకాలు అందుతున్నాయి. ఈ వ్యవస్థ ఎంత గొప్పదో... ప్రయోజనాలు పొందుతున్నవారికి బాగా అర్థమవుతుంది. ఈ సంక్షేమ పథకాలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా అమలు చేయడం గొప్ప విషయం. అధికారంలోకి రావడం కోసం పొత్తుల కన్నా ఒంటరిపోరుకే జగన్ సై అంటారు. ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన మీద అభిమానం చెక్కు చెదరలేదు. ఈ ఎన్నికల్లో జగన్ విజయం తథ్యం. ఖరీదైన వైద్యానికీ సర్కారు సాయం ప్రస్తుతం రోగాలు వస్తే దానికి వైద్యం ఎంత ఖరీదైపోయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏ రోగం వచ్చిన లక్షలకు లక్షలు మంచినీళ్లలా ఖర్చుచేయాల్సి వస్తోంది. ఒక కిడ్నీ పాడైనా చికిత్సకు రూ.20 లక్షలపైనే ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో అనుకోని వ్యాధి వస్తే ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా తట్టుకోగలవు? ఇక నిరుపేదల సంగతైతే వేరే చెప్పనక్కర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం వారిని ఎంతగానో ఆదుకుంటోంది. ఇప్పుడు వైద్య పరిమితిని రూ.25లక్షలకు పెంచారు. ఇది నిజంగా ఎక్స్ట్రార్డినరీ స్టెప్. విద్యతోనే విజయం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కొన్ని తరగతుల విద్యార్థులకు ట్యాబ్స్ అందిస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇది ఒక సమగ్ర విద్యావికాస మార్గంగా చెప్పాలి. వీటన్నింటివల్లా పాఠశాలల్లో చదివే వారిలో కనీసం 10శాతం మంది వృద్ధిలోకి వచ్చే అవకాశం కచి్చతంగా ఉంటుంది. అలా వచ్చిన వారు రూ.లక్షల్లో జీతాలు తెచ్చుకోగలుగుతారు. అప్పుడు తప్పకుండా పేదల జీవన ప్రమాణాల స్థాయి మారిపోతుంది. నిజంగా జరగాల్సింది అదే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది. -
ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
వీరిని చూస్తే రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. నేను అప్పుడప్పుడూ రంగులు మార్చితే వీళ్లు ఎన్నికలొచ్చినప్పుడల్లా కండువాలు మార్చేస్తున్నారే..? అంటూ ఒంటికాలిపై లేస్తోంది. పిలిచి టిక్కెట్లిచ్చి.. ఎన్నికల్లో గెలిపించుకున్న తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడుతోంది. ప్రజాసేవను పక్కనబెట్టి స్వార్థ రాజకీయాల కోసం పరితపిస్తున్నారని విరుచుకుపడుతోంది.. అయితే.. వారి ప్రత్యర్థులను చూస్తే జాలేస్తోందని.. వారు సౌమ్యులు.. ప్రజాసేవకులని చెప్పుకొస్తోంది. అసలు జిల్లాలో అలాంటి వారు ఎవరు..? వారి కథా కమామిషు ఏంటో మీరే చదవండి..! సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జంపింగ్ జపాంగ్లంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఒకరు వెలగపల్లి వరప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం. ఈ ముగ్గురూ ఊసరవెల్లికి మించి రంగులు మారుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరు చొక్కాలు మార్చినంత ఈజీగా, పార్టీలు, కండువాలు మార్చే నాయకులని చర్చించుకుంటున్నారు. ప్రజాసేవకంటే సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పారీ్టలు మారుతుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో పారీ్టల కండువాలు మార్చడం అలవాటుగా మార్చుకున్నారని చర్చించుకుంటున్నారు. అయితే వీరి ఎంత స్వార్థపరులో ప్రస్తుతం బరిలో ఉన్న వీరి ప్రత్యర్థులు అంత సౌమ్యులని చెప్పుకుంటున్నారు. దోపిడీకి ఆయనే ‘మూలం’ సత్యవేడు టీడీపీ అభ్యర్థి ఆదిమూలం స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తారనే ప్రచారం ఉంది. ఆదిమూలం మొదట కాంగ్రెస్, ఆ తరువాత టీడీపీలో చేరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కున చేర్చుకుని సత్యవేడు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిపారు. ఒకసారి ఓటమి పాలైనా.. రెండో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ ఆయన ప్రజలకు సేవ చేయడంలో విఫలమయ్యారు. ఇసుక, మట్టి అమ్ముకునేవారు. పరిశ్రమల నుంచి మామూళ్లు వసూళ్లు చేసేవారు. ఏదైనా సమస్యపై ఎమ్మెల్యే ఆదిమూలం వద్దకు వెళితే పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు బాధితులు చెబుతున్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కుమారుడు సుమన్ చేయని అరాచకాలు లేవు. అధికారులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విలేకరులపైన దౌర్జన్యాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆదిమూలానికి వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించింది. ఛీత్కారాలే ప్రజలకు ‘వర’ం తిరుపతి పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాద్ ఎదుటి వాళ్లను తిట్టడం, సొంత వాళ్లను ఆకాశానికి ఎత్తడం ఆయన నైజం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని 2014లో తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గూడూరు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన పనితీరు బాగాలేక పోవడంతో టికెట్ ఇవ్వలేదు. పదవుల రుచి మరిగిన ఆయన గారికి ఇప్పుడు దళిత జాతి ఆత్మగౌరవం గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. దళితుల్ని జగన్ అణచివేస్తున్నారనే ఆయన గారి విమర్శలు విన్న జనానికి దెయ్యాలువేదాలు వల్లించినట్లుందని చెప్పుకుంటున్నారు. అధికారం కోసం ఆయన మొదట ప్రజారాజ్యం, ఆ తరువాత వైఎస్సార్సీపీ, ఇప్పుడు బీజేపీలో చేరారు. టీడీపీ, జనసేన వద్దంటే బీజేపీ కండువా కప్పుకుని కూటమి అభ్యర్థి అయ్యారు. ఇతను పదవి కోసం తప్ప ప్రజలతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంటారు. గతంలో ఆయన తిరుపతి ఎంపీగా కొనసాగినప్పటికీ,ప్రజానీకంతో సంబంధం లేకుండా, అలంకారప్రాయంగా ఉన్నారు. ఎవరైనా సమస్యతో వరప్రసాద్ దగ్గరికెళితే ఛీత్కరించుకున్న ఘటనలు బోలెడు. వరప్రసాద్ ఎంపీ, ఎమ్మెల్యే అయ్యారంటే కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలువే.రౌడీయిజం..ఆరణి నైజం తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్నటి వరకు చిత్తూరు జిల్లా కేంద్రం. అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా.. ఆయన అస్సలు పట్టించుకోలేదు. తమ సమస్యలపై వెళితే ఎంత ఇస్తావ్..? అని అడిగిన సందర్భాలేన్నో ఉన్నాయని బాధితులు చెబుతుంటారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని భూములు ఆక్రమించుకోవడం, అభివృద్ధి పనుల్లో పర్సెంటేజ్లు, అధికారుల నుంచి మామూళ్లు, నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడం, రౌడీయిజం ఆరణి నైజం. ఆయన మొదట టీడీపీలో ఉంటూ.. టికెట్ ఇవ్వకపోతే ప్రజారాజ్యంలో చేరి చిత్తూరు అభ్యరి్థగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మరళా టీడీపీలో చేరారు. అప్పుడూ టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని ఎమ్మెల్యే అయిన ఆరణి స్వార్థ రాజకీయం కోసం జనసేనలో చేరి ప్రశాంతతకు మారుపేరైన తిరుపతిలో అలజడులు సృష్టిస్తున్నారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- వంట సరిగా చేయలేదని.. భార్యను చంపిన భర్త
Advertisement