ఐదుగురు దొంగల అరెస్ట్: భారీ ఎత్తున నగలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

ఐదుగురు దొంగల అరెస్ట్: భారీ ఎత్తున నగలు స్వాధీనం

Published Sat, Apr 9 2016 5:40 PM

5 thieves arrested

ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) : జంగారెడ్డిగూడెంలో శనివారం సాయంత్రం ఐదుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి భారీ ఎత్తున బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. వెంకటరమణ, సుంకర పవన్ కుమార్, హరీష్, ఎస్‌కే అహ్మద్, లాగు రాజేష్ అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి జిల్లాలోనే పలు పట్టణాల్లో పగటి పూట చోరీలు చేసేవారని చెప్పారు. జంగారెడ్డిగూడెం బస్టాండులో వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి 57 కాసుల బంగారు నగలు, పావు కేజీ వెండి నగలు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. 

Advertisement
Advertisement