మళ్లీ వైఎస్ఆర్ సీపీలో చేరిన కడప కార్పొరేటర్లు | Sakshi
Sakshi News home page

మళ్లీ వైఎస్ఆర్ సీపీలో చేరిన కడప కార్పొరేటర్లు

Published Thu, Feb 2 2017 5:43 PM

మళ్లీ వైఎస్ఆర్ సీపీలో చేరిన కడప కార్పొరేటర్లు - Sakshi

కడప: గతంలో వైఎస్ఆర్ సీపీని వీడిన ఆరుగురు కడప కార్పొరేటర్లు మళ్లీ సొంతగూటికి చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. గురువారం వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ సీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా కార్పొరేట్లరు చెప్పారు.

కడప కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ తరఫున గెలిచిన ఈ ఆరుగురు కార్పొరేటర్లు గతంలో టీడీపీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, మేయర్ సురేష్‌ బాబు నేతృత్వంలో మళ్లీ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న జగన్ పలు కార్యక్రమాల్లో  పాల్గొంటారు.

(చదవండి: నేటి నుంచి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన)

Advertisement

తప్పక చదవండి

Advertisement