రోడ్డు ప్రమాదంలో పాస్టర్ దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పాస్టర్ దుర్మరణం

Published Tue, Aug 4 2015 9:45 PM

A church paster died in a faster died

పశ్చిమ గోదావరి(కొవ్వూరు): పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దొమ్మేరు శివారున పెట్రోలు బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరపల్లికి చెందిన పూలపల్లి జాన్ లూధరన్ ప్రకాష్‌బాబు అనే వ్యక్తి మృతి చెందారు. ప్రకాష్‌బాబు తన కుమారుడు కలిసి రాజమండ్రి వెళ్లి మోటారు సైకిల్ పై తిరిగి వస్తుండగా పెట్రోలు బంక్ సమీపంలో పంది అడ్డురావడంతో దానిని ఢీకొట్టడంతో ప్రకాష్‌బాబు తలకు బలమైన గాయాలయ్యాయి.

108వాహనంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మృతుని కుమారుడు పూలపల్లి జాన్‌సైలన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కె.సుబ్బారావు తెలిపారు. ప్రకాష్‌బాబు దేవరపల్లిలో చర్చిపాస్టర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement