సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీ రాజధాని నగరంలో పరిపాలనకు సంబంధించిన అన్ని విభాగాలకూ 1,228 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కాంప్లెక్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని ప్రభుత్వ కాంప్లెక్స్గా (క్యాపిటల్ గవర్నమెంట్ కాంప్లెక్స్) పిలిచే ఈ ప్రాంతంలోనే అసెంబ్లీ, సెక్రటేరియేట్, హైకోర్టు, రాజ్భవన్, వివిధ శాఖల డెరైక్టరేట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించింది.
సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలు తయారుచేసిన మాస్టర్ప్లాన్కు అనుగుణంగా సీడ్ క్యాపిటల్లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఈ భవనాలు నిర్మిస్తారు. సీడ్ క్యాపిటల్ 16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రభుత్వ కాంప్లెక్స్లో కృష్ణానదీ ముఖంగా సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు నిర్మించ నున్నారు. నివాస భవనాలు కూడా ఈ కాంప్లెక్స్లోనే ఉండేలా వ్యూహరచన చేశారు. ఈ భవనాల్లో దేన్ని ఎంత విస్తీర్ణంలో నిర్మించాలనే విషయాలను కూడా ఖరారు చేశారు.
ప్రభుత్వ కాంప్లెక్స్లో అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలను అత్యధికంగా 335 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఆ తర్వాత డెరైక్టరేట్లకు అత్యధికంగా 260 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. కాంప్లెక్స్లో ముఖ్యమంత్రి సెక్రటేరియేట్ను అతి తక్కువగా 15 చదరపు మీటర్లలో నిర్మించనున్నారు.
ఈ భవనాలన్నింటినీ అంతర్జాతీయ ప్లానింగ్ నిబంధనలు, అర్బన్ డిజైన్ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర సంస్కృతి, చరిత్ర ప్రతిబింబించేలా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు పెద్దఎత్తున తిరుగుతూ సమావేశాలు, కాన్ఫరెన్సులు నిర్వహించే ఈ ప్రాంతాన్ని హైసెక్యూరిటీ జోన్గా మారుస్తారు. ఈ ప్రభుత్వ కాంప్లెక్స్ డిజైన్, ఆర్కిటెక్చర్ నమూనాలు తయారుచేసేందుకు సీసీడీఎంసీ కన్సల్టెంట్లను ఆహ్వానించింది.
పాలన అంతా ఒకే చోట
Published Wed, Jun 10 2015 8:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement