ప్రమాద వశాత్తు ట్రాక్టర్ దగ్ధం | Sakshi
Sakshi News home page

ప్రమాద వశాత్తు ట్రాక్టర్ దగ్ధం

Published Tue, Jan 5 2016 5:16 PM

accidentally Tractor burned

నెలిమర్ల మండలంలోని విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపై ఎండుగడ్డితో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ దగ్ధమైంది. మంటలు ఎలా అంటుకున్నదీ తెలియలేదు. గుర్ల మండలం కలువచర్ల గ్రామం నుంచి నెల్లిమర్ల మండలం నారాయణపట్నానికి గడ్డిని ట్రాక్టర్‌లో తీసుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు యజమాని వావి రామునాయుడు తెలిపారు. ఫైరింజన్ వచ్చే లోపు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ ప్రాంతంలో 2 కి.మీల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.



 

Advertisement
Advertisement