కమలనాథన్ సిఫార్సులకు సీఎస్ల ఆమోదం | Sakshi
Sakshi News home page

కమలనాథన్ సిఫార్సులకు సీఎస్ల ఆమోదం

Published Wed, Aug 20 2014 6:02 PM

కమలనాథన్ సిఫార్సులకు సీఎస్ల ఆమోదం - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం బుధవారం జరిగింది. ఉద్యోగుల విభజనలో పరస్పరం సహకరించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కమలనాథన్ కమిటీ సిఫార్సులను ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు ఆమోదించారు.

ఉద్యోగుల విభజనకు కమలనాథన్ కమిటీ సూచించిన మార్గదర్శకాలు రెండు రోజుల్లో డీవోపీటికి చేరనున్నాయి. డీవోపీటీ నుంచి ప్రధానమంత్రి వద్దకు  ఫైల్‌ వెళ్లనుంది. విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు గవర్నర్ సమక్షంలో నిర్ణయించిన సంగతి విదితమే.

Advertisement
Advertisement