విజిలెన్స్ అధికారుల దాడులు
తాడేపల్లి రూరల్ మండల పరిధిలోని ప్రాతూరు క్రాస్ రోడ్స్ వద్ద బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి నాలుగు ఇసుక లారీలు సీజ్ చేశారు. మొదట విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రాతూరు క్రాస్రోడ్స్ నుంచి అధిక సంఖ్యలో ఇసుక లారీలు తరలి వెళుతుండగా, వాటిని ఆపి ధృవపత్రాలు ఉన్నాయో, లేవోనని పరిశీలించారు. వే బిల్లులపై తేదీ ఉండడం, సరైన సమయం నమోదు చేసి ఉండకపోవడంతో ఎస్పీకి అనుమానం వచ్చి డ్రైవర్లను ప్రశ్నించారు. ఉద యం పూట ఇసుక లోడు చేసినందుకుగాను త మ వద్ద సీనరేజిగా రూ.5500 తీసుకుంటారని, అదే సాయంత్రం వే బిల్లులు లేకుండా రూ, 4800 తీసుకుంటారని తెలిపారు. నాలుగు లారీలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి తాడేపల్లి పోలీసుస్టేషన్కు తరలించారు. అక్కడ నుంచి విజిలెన్స్ అధికారులు గుండిమెడ ఇసుక క్వారీకి వెళ్లారు. మార్గమధ్యలో ఒక ఇసుక లోడుతో వస్తున్న లారీని ఆపగా, అధికారులను చూచి లారీ డ్రైవర్ లారీ అక్కడే వదిలివేసి పారిపోయాడు. అనంతరం ఇసుక క్వారీలోకి వెళ్లిన అధికారులు పలు విషయలపై క్వారీ నిర్వాహకులను ప్రశ్నించారు.
నిర్వాహకుడిపై విజిలెన్స్ ఎస్పీ ఆగ్రహం
నిబంధనలకు విరుద్దంగా వే బిల్లులపై సరైన సమయం నమోదు చేయకుండా ఇసుక లోడుల ఉదంతంపై కార్వీ నిర్వాహకుడిని విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి నిలదీశారు. గతంలో రూ. 4 కోట్ల విలువైన ఇసుక క్వారీని సామాన్య మధ్యతరగతి వారికి గృహ నిర్మాణానికిగాను ప్రభుత్వం రూ.40 లక్షలకే కేటాయించగా, అధిక ధరలకు ఇసుక విక్రయిస్తున్నారంటూ ఎస్పీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
విజిలెన్స్ అధికారుల దాడులు
Published Thu, Feb 13 2014 12:11 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement