ఆటోను ఢీకొన్న లారీ..ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న లారీ..ఇద్దరి మృతి

Published Fri, Jan 29 2016 6:45 PM

Both killed in a collision with a lorry auto

అమరావతి మండలం పెద్దమద్దూరు వద్ద లారీ ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరుకుళ్లపాడు గ్రామానికి చెందిన కె.శిఖామణి(50), మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన గాదె సామ్రాజ్యం(60) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా..మరో నలుగురు గాయపడ్డారు.

ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.బాధితులంతా అమరావతి నుంచి మంగళగిరికి ఆటోలో వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement