రాష్ట్ర విభజన పేరుతో కేంద్రం ప్రభుత్వం మైండ్గేమ్ ఆడుతుందని జస్టిస్ లక్ష్మణ్రెడ్డి వ్యాఖ్యానించారు. విభజన జరిగిపోయిందన్న వాదనను తిప్పికొట్టాలని ఆయన సీమాంధ్ర ప్రజలందరు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తిరుపతిలో విలేకర్లతో మాట్లాడుతూ... సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్ర విభజన జరగదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసిన అన్ని విధాలను చట్టపరంగా ఎదుర్కొంటామని జస్టిస్ లక్ష్మణ్రెడ్డి పేర్కొన్నారు.