రాజమండ్రి నుంచి బయల్దేరిన చంద్రబాబు | Sakshi
Sakshi News home page

రాజమండ్రి నుంచి బయల్దేరిన చంద్రబాబు

Published Thu, Jun 18 2015 6:15 PM

రాజమండ్రి నుంచి బయల్దేరిన చంద్రబాబు - Sakshi

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి నుంచి అర్ధంతరంగా బయల్దేరి విజయవాడకు వెళ్లారు. ఆయన అక్కడే గురువారం రాత్రి బస చేస్తారు. గురువారం సాయంత్రం రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించుకుని ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు. విజయవాడ నుంచి శుక్రవారం నాడు ఆయన తిరుపతి వెళ్లనున్నట్లు సమాచారం.

ఈ రోజు చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. వాస్తవానికి ఆయన పుష్కర ఘాట్ల ఏర్పాట్లను పర్యవేక్షించాల్సి ఉంది. కానీ అసలు ఘాట్లనే సందర్శించలేదు. గోదావరి జిల్లాల పర్యటనలో చంద్రబాబు ముభావంగా కనపించారు. ఎక్కువ సేపు ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు.  పట్టిసీమ పనులను పరిశీలించిన అనంతరం రాజమండ్రికి వెళ్లారు. రాజమండ్రిలో అధికారులతో సమావేశాన్ని మధ్యలోనే ముగించుకున్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో నిర్ణీత సమయం కంటే ముందుగానే విజయవాడకు బయల్దేరినట్టు భావిస్తున్నారు.

Advertisement
Advertisement