'మోసం, అబద్దాలకు చంద్రబాబు పెట్టింది పేరు' | Sakshi
Sakshi News home page

'మోసం, అబద్దాలకు చంద్రబాబు పెట్టింది పేరు'

Published Thu, Oct 9 2014 6:59 PM

'మోసం, అబద్దాలకు చంద్రబాబు పెట్టింది పేరు' - Sakshi

అనంతపురం: మోసం, అబద్దాలకు చంద్రబాబు పెట్టింది పేరని వైఎస్సార్ సీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామని, ముఖ్యమంత్రి అయ్యాక ఆంక్షల పేరుతో జారుకుంటున్నారని దుయ్యబట్టారు.

వైఎస్సార్ సీపీ పోరాటాల పార్టీ అని, చంద్రబాబు మోసాలపై నిరంతరం ఉద్యమిస్తామని చెప్పారు. రుణమాఫీ కోరుతూ ఈనెల 16న నిర్వహించే ధర్నాలు విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

Advertisement
Advertisement