ఉలవపాడు (కందుకూరు), న్యూస్లైన్: రాష్ట్రం ఒక పక్క భగ్గుమంటూ అతలాకుతలమవుతుంటే ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దీక్ష చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు. 72 గంటల నిరవధిక బంద్ సందర్భంగా చివరి రోజు ఆదివారం ఉలవపాడులో హైవే దిగ్బంధం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నూకసాని మాట్లాడుతూ సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా నానా అవస్థలు పడుతుంటే చంద్రబాబు మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నాడని, ఆయన వ్యవహార శైలి ఆయన సన్నిహితులకే అంతుపట్టడం లేదన్నారు.
అసలు ఢిల్లీలో దీక్ష ఎందుకు చేస్తున్నారో ఇంత వరకు స్పష్టంగా చెప్పకపోవడం విడ్డూరమన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ టీడీపీ నాయకులతో కలిసి తెలంగాణ ను విడగొట్టాలని సోనియాకు చెప్పినట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ వ్యవహారం టీడీపీ ఎంపీ సీఎం రమేష్, బొత్స సత్యన్నారాయణను అతి రహస్యంగా కలవడంతోనే బయటపడిందన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి కుయుక్తులు పన్నుతూ జగన్పై వాటిని నెట్టాలని చూడడం ఆకాశంపై ఉమ్మి వేసిన చందంగా ఉంటుందని చెప్పారు. కందుకూరు పార్టీ సమన్వయకర్త తూమాటి మాధవరావు మాట్లాడుతూ 67 రోజులుగా ఆందోళనలు, రాస్తారోకోలు, బంద్లు చేస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలకు దున్నపోతుపై వాన కురిసిన చందంగా మారిందని విమర్శించారు.
ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రానికి వచ్చి మరో మాట చెప్పడం ఆ పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందన్నారు. టీ నోట్ను వెనక్కు తీసుకోకపోతే పరిస్థితి తీవ్రమవుతుందని ధ్వజమెత్తారు. మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల జిల్లాలో తాగు, సాగు నీటి సమస్య జఠిలమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కందుకూరు జేఏసీ నాయకుడు ఆర్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు సమైక్యాంధ్ర విషయంలో స్పష్టమైన వైఖరితో ఉండాలని పిలుపునిచ్చారు. 67 రోజులుగా ఉద్యమం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొల్లూరి కొండయ్య, రాష్ట్ర పార్టీ బీసీ సెల్ సభ్యుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బూర్సు మాలకొండయ్య, జేఏసీ నాయకులు గాయత్రి రామకృష్ణ, పెరుగు ప్రసాదు, ఏవీ.రావు, టీజే.విలియంతో పాటు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుకు మతిభ్రమించింది
Published Mon, Oct 7 2013 3:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement