Sakshi News home page

ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు

Published Tue, May 20 2014 1:08 AM

ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు - Sakshi

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా..
 సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల సమావేశంలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు జనసేన వ్యవస్థాపకుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించడంతో పాటు ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలను ప్రభుత్వంలో చేర్చుకునే అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. ప్రభుత్వంలో చేరాలంటూ భాగస్వామ్యపక్షాలకు ఆహ్వానం అందితే అందుకు టీడీపీ సిద్ధంగా ఉంది.
 
 బాబును కలిసిన బీజేపీ నేతలు: టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ సీమాంధ్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు కలిశారు. ఆయనతో పాటు బీజేపీ తరపున సీమాంధ్ర నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బాబును కలిశారు. వారిది మర్యాద పూర్వక భేటీయేనని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

What’s your opinion

Advertisement