ఏపీ సర్కారుకు ఏడాదికి రూ.1200 కోట్ల రాబడి
జపాన్ వెళుతూ సీఎం సంతకం.. జీవోల జారీ
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబుఒకే ఒక్క సంతకంతో ఏడాదికి అదనంగా రూ.1,200 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చే నిర్ణయం తీసుకున్నారు. భూములు, స్థలాల క్రయవిక్రయాలకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, కుటుంబాల మధ్య సెటిల్మెంట్, గిఫ్ట్ (భూ కానుక) డీడ్ల ఫీజులను పెంచే ఫైలుపై సీఎం జపాన్ పర్యటనకు వెళ్లే ముందు సంతకం చేశారు. ఆ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.సింగ్ బుధవారం మూడు జీవోలను జారీ చేశారు. ఈ పెంపు వెంటనే (బుధవారం నుంచే) అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు.
దీంతో భూములు, స్థలాలు క్రయ విక్రయదారులపై ఏడాదికి సుమారు రూ.1200 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా. జీవోల ప్రకారం.. స్టాంపు డ్యూటీ ప్రస్తుతం ఉన్న 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతం నుంచి 1 శాతానికి పెరిగింది. కుటుంబాల మధ్య జరిగే సెటిల్మెంట్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లపై ప్రస్తుతం ఉన్న ఒక శాతం స్టాంపు డ్యూటీని రెండు శాతానికి పెంచుతూ జీవో జారీ అయ్యింది. విభజిత ఆంధ్రప్రదేశ్లో స్టాంపులు, రిజస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం ఇప్పటికే బాగా పెరిగింది. నూతన రాజధాని నిర్మాణం జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల క్రయ విక్రయాలు బాగా పెరగడంతో ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఆదాయం పెంపుపై దృష్టిసారించిన ప్రభుత్వం.. వస్తున్న చోటే మరింత ఆదాయం పొందాలన్నట్టుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో సెటిల్మెంట్, గిఫ్ట్ డీడ్లపై స్టాంపు డ్యూటీని కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం తగ్గించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వాటిపై కూడా స్టాంపు డ్యూటీని పెంచింది.
పెంపు వివరాలు.. (శాతాల్లో) రంగం
ఇప్పటివరకు ఇకపై స్టాంపు డ్యూటీ 4 5
రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 1
కుటుంబసభ్యుల మధ్య ఒప్పందం 1 2
ఇతరుల మధ్య ఒప్పందం 2 3
రక్త సబంధీకులకు కానుకలు 1 2
ఇతరుల మధ్య కానుకలు 4 5
భాగస్వామ్య ఒప్పందాలు(కుటుంబసభ్యులు) 0.5 1
ఇతరుల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు 1 2
బాదుడే బాదుడు
Published Thu, Nov 27 2014 3:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement