'డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్నారు' | Sakshi
Sakshi News home page

'డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్నారు'

Published Sun, Aug 10 2014 11:10 PM

'డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్నారు' - Sakshi

శ్రీకాకుళం: డ్వాక్రా మహిళలను మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేయడానికి సిద్దమవుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. 
 
రుణాల మాఫీపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకే ఇసుక అమ్మకాలు, సోలార్ ప్రాజెక్టులంటూ డ్వాక్రా మహిళలను మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళల ముసుగులో ఇసుక అమ్మకాలను టీడీపీ కార్యకర్తలకు అప్పగించాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ అని తమ్మినేని సీతారాం విమర్శించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement