కడియం : మండలంలోని మురమండ గ్రామంలో గురువారం జరగనున్న బాల్యవివాహాన్ని అధికారులు ముందుగానే అడ్డుకున్నారు. వధువు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అధికారుల కథనం ప్రకారం... మురమండ ఏఎంజీ నగర్కు చెందిన 13 ఏళ్ల బాలికకు గురువారం ఆమె మేనమామతో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందజేశారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ నర్సమ్మ సూచన మేరకు సూపర్వైజర్ సీహెచ్ హెలెన్ విషయాన్ని గ్రామ సర్పంచ్ ఈదర పాపారావుకు తెలిపారు. దీంతో వీరందరూ కలసి బుధవారం బాలిక ఇంటికి చేరుకున్నారు.
చిన్నవయస్సులో వివాహం చట్టరీత్యా నేరమని, దీని వల్ల ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు, బంధువులకు వివరించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు వివాహాన్ని నిలిపివేస్తామని అధికారులకు లిఖితపూర్వంగా హామీ ఇచ్చారు. బాలిక మేనమామ తల్లి ఇటీవలే మరణించారని, ఏడాదిలోపు పెళ్లి చేస్తే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాలిక తల్లిదండ్రులు చెప్పారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల వారి నుంచి వివాహం నిలిపివేస్తున్నట్టుగా వీఆర్వో పి. శంకర్రావు లిఖితపూర్వకంగా
రాయించుకున్నారు.
బాల్య వివాహానికి బ్రేక్!
Published Thu, Aug 14 2014 12:50 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- అద్దెకివ్వడమే శాపమయ్యింది! ఏకంగా ప్రియుడితో కలిసి..
- ‘వర్జిన్ ఓటర్’గా మిగలకండి!
- ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- ‘అమేథీలో నా ప్రత్యర్థి ప్రియాంకానే’
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- క్యాన్సర్తో నరేష్ గోయల్ భార్య కన్నుమూత
- గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
Advertisement