-
కొడుకు కోత
కన్నబిడ్డ పోతే తల్లిదండ్రులకు మిగిలేది కడుపుకోత. బిడ్డ ఉండీ నిరాదరణకు గురిచేస్తుంటే... అది కడుపుకోతను మించిన కొడుకు కోత. తల్లిదండ్రులను దైవంగా చూసుకునే సమాజంలో కనీసం మనుషుల్లా చూసే అవకాశం కూడా కపడట్లేదు. నేను అంటే ఏంటి? నేను సంపాదించుకున్న జ్ఞానం! అంటే నేను చదువుకున్న పుస్తకాలు, నా అనుభవానికి అందిన జీవితం! ఈ జీవితంలో అమ్మానాన్న లేకుండా ఉంటారా? మనకు కనపడిన మొదటి పుస్తకాలు వాళ్లేగా? అక్షరం నేర్చుకుని ఆప్యాయత పోగొట్టుకున్నామా? ఆదాయం వచ్చాక అభిమానాలు చంపుకున్నామా? ఎలాంటి కథైనా వినొచ్చు. కాని ఇలాంటి కథైతే ఎప్పుడూ వినకూడదు. మనకు తెలియకుండా.. మనకు తెలిసీ.. మన చుట్టుపక్కల ఇలాంటి కథలు, వ్యధలు, బాధలు ఎన్నో గట్టిగా అరిచి వాటి ఉనికిని తెలియజేస్తూనే ఉంటాయి. యాంత్రిక జీవితంలో మనకు ఈ వ్యధలు కనపడవు. వినపడవు. వనపర్తి జిల్లా, వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలోని 70 ఏళ్ల బాల్రెడ్డి, 60 ఏళ్ల నర్సమ్మ దంపతులది అలాంటి గాథే! ఈ వాస్తవ సంఘటన మనల్నందరినీ తట్టిలేపుతుందని... మన బాధ్యతను గుర్తుచేస్తుందనే ఆశతో జీవిత చరమాంకంలో ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్న వేదనను చెప్తున్నాం.ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ప్రభాకర్రెడ్డి ఉన్నారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు వ్యవసాయం చేశాడు బాల్రెడ్డి. ఉన్న పొలంలో రెండు ఎకరాలు కొడుకు కోసం ఉంచి మిగిలినది అమ్మి ఆడపిల్లలకు పెళ్లి చేశాడు. ఆడపిల్లల బాధ్యత తీరాక కొడుక్కి పెళ్లిచేశారు. అప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. భార్యమాట వింటూ తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశాడు కొడుకు. రోజులు గడుస్తున్నాయి. కొడుక్కి పిల్లలు పుట్టారు. పెరిగారు. కొడుకు, కోడలు చీదరింపులు, సాధింపులు ఎక్కువయ్యాయి తప్ప తగ్గలేదు. కొడుకు కూతురు పెళ్లీడుకొచ్చింది. పెళ్లి చేయడానికి తన దగ్గర డబ్బుల్లేవని, ఆ రెండెకరాల పొలాన్ని అమ్మేద్దామని తండ్రిని అడిగాడు ప్రభాకర్రెడ్డి. కొడుకు అడిగిందే తడవుగా ఒప్పుకొని మనవరాలి పెళ్లికి సహాయం చేశాడు బాల్రెడ్డి. అయినా ఆ కొడుకుకు తల్లిదండ్రుల మీద ప్రేమ రాలేదు. చీటికి మాటికి గొడవ పడడమే కాక చేయి కూడా చేసుకున్నాడు. దీంతో మనస్థాపం చెందిన ఆ వృద్ధులు కూతుళ్ల దగ్గరకు వెళ్లారు. ఇది జీర్ణించుకోలేని ప్రభాకర్రెడ్డి అక్కాచెల్లెళ్లతోనూ గొడవపడ్డాడు. ‘అమ్మానాన్నకు అన్నం పెట్టొద్దు. వాళ్లను మీ దగ్గర ఉంచుకోవద్దు’ అని వాళ్లను బెదిరించాడు. దాంతో వారు కూడా తల్లిదండ్రులను బయటికి పంపించారు. వాటర్షెడ్హాల్... వృద్ధాప్య ఫించన్ కొడుకు చూడక.. బిడ్డలనూ చూడనివ్వకపోవడంతో ఆ అమ్మానాన్న ఊళ్లోని కమ్మూనిటీ హాల్లో తలదాచుకున్నారు. బాల్రెడ్డికి వచ్చే వెయ్యి రూపాల వృద్ధాప్య పింఛనే ఆ భార్యాభర్తకు జీవనాధారం. అవి మందులకే సరిపోతున్నాయి. ఇరుగుపొరుగు వారు పెట్టేది తింటూ బతుకీడుస్తున్నారు. ఏదో ఒకలా రోజులు గడుస్తున్నాయనుకుంటుంటే... బాల్రెడ్డి కింద పడి కాలు విరిగి మంచానికి పరిమితమయ్యాడు. అన్నీ తానై భర్తను చూసుకుంటోంది నర్సమ్మ. జీవిత చరమాంకంలో వీరికి తినడానికి తిండి, ఉండడానికి వసతి తప్ప మరే ఆశలూ లేవు. కొడుకు నుంచి రక్షణ, సంరక్షణ కల్పించాలని మొరపెట్టుకుంటున్నారు. ఈ విషయం తెలుసా? ప్రభాకర్రెడ్డిలాంటి పిల్లలకు ఒక విషయం తెలుసో లేదో? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సరిగా చూడకపోతే... వాళ్ల యోగక్షేమాలను పట్టించుకోకపోతే జైలు శిక్ష ఉంటుంది. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ బిల్, 2007 ప్రకారం పిల్లలకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షను తప్పించుకోవడానికి వీలు లేదు. అప్పీలుకు చాన్స్ లేదు. ఈ కష్టం ఎవరికీ రావద్దు ‘ఎన్నో బాధలుపడి కొడుకును పెంచి పెద్ద చేశాం. ఈ రోజు వాడు మమ్మల్ని పగవాళ్లలా చూస్తున్నాడు. ఈ కష్టం ఎవరికీ రావద్దు’ అంటున్నాడు బాల్రెడ్డి. మమ్ముల్ని ఎక్కడా ఉండనీయడం లేదు. ఊళ్లోవాళ్ల సాయంతో ఈ వాటర్షెడ్ హాల్లో ఉంటున్నాం. బిడ్డలు మాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామని చెప్పారు. కానీ నా కొడుకు పడనీయట్లేదు. వాళ్లతో కొట్లాడ పెట్టుకుంటున్నాడు. ఆ భయంతో వాళ్లు మా దగ్గరికి రావట్లేదు. మేము ఎక్కడున్నా అక్కడికొచ్చి గొడవపడుతున్నాడు. భయంభయంగా గడుపుతున్నాం’ అంటు కళ్లనీళ్ల పర్యంతమైంది నర్సమ్మ. – సిలివేరు యాదగిరి, సాక్షి, వనపర్తి -
తల్లిని చంపి.. గదికి తాళం వేసి..
ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన కూతురు నాలుగు రోజులుగా ఇంట్లోనే మృతదేహం దుర్వాసన రావడంతో ఆలస్యంగా వెలుగులోకి.. నవాబుపేట: తల్లిని ఓ కూతురు దారుణంగా హత్య చేసింది. 4 రోజులపాటు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నవా బుపేట మండలం ఇప్పటూర్కు చెందిన నర్సమ్మ(79), జంగయ్య భార్యాభర్తలు. వారికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కూతురు పార్వతమ్మను భర్త వదిలేయడంతో కొన్నేళ్లుగా తల్లి వద్దే ఉంటోంది. తరచూ తల్లితో గొడవ పడేది. ఈ క్రమంలో 4 రోజుల క్రితం కూడా గొడవ పడింది. కర్రతో తలపై బాదడంతో తల్లి రక్తస్రావమై పడిపోయింది. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి వృద్ధురా లిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. మృతదేహంతో నాలుగు రోజులు తల్లిని హత్య చేసిన పార్వతమ్మ భయాందోళనకు గురై మృతదేహంతో నాలుగు రోజులు గడిపింది. తల్లి ఉన్న గదికి తాళం వేసి వేరేగదిలో ఉంది. మృతదేహం కుళ్లిపోయి ఇం ట్లో నుంచి దుర్వాసన రావటంతో గురువారం ఇరుగు పొరుగువారు నిలదీశారు. దీంతో అమ్మ ఆత్మహత్య చేసు కుందని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమెపై అనుమానం వచ్చి వారు ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడి ఆనవాళ్లను బట్టి కూతురే హత్య చేసినట్లు అనుమానించారు. వెంటనే పోలీ సులకు సమాచారమివ్వడంతో వారొచ్చి విచారణ చేప ట్టారు. చేసేదిలేక చేసిన నేరం ఒప్పుకుంది. కోపంలో 4 రోజుల క్రితమే చంపానని ఒప్పుకుంది. చేరదీసినా చంపేసింది.. పన్నెండేళ్ల కిందట హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పార్వతమ్మకు పెళ్లి చేసింది. కొంతకాలానికే కూతురు వ్యవ హార శైలి నచ్చక భర్త వదిలేశాడు. దీంతో తల్లి చేరదీసి తనతోపాటే ఇంట్లో పెట్టుకుంది. కూలీనాలీ చేసుకుంటూ తల్లీకూతుళ్లు కాలం వెళ్లదీసేవారు. తల్లి వయసు మీద పడినప్పటి నుంచి ఆమెతో తగువు పడటం మొదలుపెట్టింది. డీఎస్పీ విచారణ విషయం తెలుసుకున్న డీఎస్పీ భాస్కర్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఇరుగు పొరుగు వారితో సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. నాడు కొడుకు చేతిలో తండ్రి ఐదేళ్ల క్రితం నర్సమ్మ భర్త జంగయ్యను కన్నకొడుకే హత్య చేశాడు. పెద్ద కుమారుడు నారాయణ తాగిన మైకంలో ఇంట్లోనే కర్రతో మోది దారుణంగా చంపేశాడు. అతనిపై కేసు నమోదవగా ప్రస్తుతం ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తల్లికి ఆసరాగా ఉంటుందనుకున్న కూతురు కూడా అదేబాటలో నడవడంతో గ్రామస్తులు ఆమెపై శాపనార్థాలు పెట్టారు. -
డీసీఎం ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలి మృతి
చందానగర్లో డీసీఎం వాహనం ఢీకొని నర్సమ్మ(29) అనే పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్కు కాసేపు అంతరాయమేర్పడింది. -
విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
చదువుపై ఆసక్తితో కళాశాలకు వెళ్లిన ఓ అంధ విద్యార్థి కరెంట్షాక్తో చనిపోయాడు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకుంది. మండలంలోని కూనంనేనివారిపాలెం గ్రామానికి చెందిన యాకోబు, నర్సమ్మ దంపతుల కుమారుడు చింటు(16) పుట్టుకతోనే అంధుడు. అయినప్పటికీ, అతడు పట్టుదలతో చ దివి పదో తరగతి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇటీవలే చీమకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ గ్రూప్లో చేరాడు. మంగళవారం కళాశాలకు వెళ్లిన చింటు తెలియక తరగతి గది గోడకు ఉన్న విద్యుత్ వైర్లను తాకాడు. అందులో విద్యుత్ ప్రసారం అవుతుండటంతో షాక్తో అక్కడికక్కడే చనిపోయాడు. తమ కుమారుడి మృతికి కళాశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఆ కి‘లేడీ’ పై 15 కేసులు
జియాగూడ(హైదరాబాద్ సిటీ): మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఓ మహిళను కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నందున పీడీ యాక్ట్ విధించి చంచల్గూడ మహిళా జైలుకు తరలించినట్లు కుల్సుంపురా ఇన్స్పెక్టర్ రామ్మోహన్రావు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ ఖాలీజ్ఖాన్ దర్గా ప్రాంతానికి చెందిన చల్లా నర్సమ్మ(40) కొన్ని నెలలుగా మాయమాటలు చెప్పి ప్రజల వద్ద నుంచి బంగారు వస్తువులు చోరీ చేస్తోంది. ఈమెపై సుమారు 15 వరకు కేసులు పలు పోలీస్స్టేషన్లలో నమోదై ఉన్నాయి. కాగా కుల్సుంపురా పోలీస్స్టేషన్లో ఓ కేసులో నిందితురాలు కావడంతో నర్సమ్మను పోలీసులు అరెస్టు చేసి పీడీ యాక్ట్ విధించి చంచల్గూడ మహిళా జైలుకు తరలించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement