నగరాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం | Sakshi
Sakshi News home page

నగరాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం

Published Thu, Nov 20 2014 2:00 AM

నగరాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం

ఎమ్మెల్యే అంజద్‌బాషా

కడప కల్చరల్ : కడప నగరాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుదామని, అందుకు అధికారులు, ప్రజలు సహకరించాలని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా అన్నారు. భారత జాతీయ కళా సంసృ్కతివారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని నేక్‌నామ్ కళాక్షేత్రంలో ‘స్వఛ్చ భారత్ - సమాజం బాధ్యత’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ఇందులో పలువురు ప్రముఖులు తమ సూచనలను తెలిపారు.

ఇంటాక్ కన్వీనర్ ఎలియాస్‌రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కెస్కో సంస్థ కార్యదర్శి అలపర్తి పిచ్చయ్యచౌదరి, కవి పాలాది లక్ష్మికాంతం శ్రేష్టి, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగరాజు, ఇంటాక్ మాజీ కో కన్వీనర్ జానకిరాం, సభ్యులు మాచిరాజు రమణయ్య, సైకాలజిస్టు ఓవీ రెడ్డి, రైతు నాయకుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, వీటా సంస్థ ప్రతినిధి వేణు, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సుబ్బరాయుడు, రవి, బీజేపీ నాయకుడు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement