హామీలు అమలయ్యేదాకా విశ్రమించను | Sakshi
Sakshi News home page

హామీలు అమలయ్యేదాకా విశ్రమించను

Published Thu, Feb 11 2016 2:22 AM

హామీలు అమలయ్యేదాకా విశ్రమించను - Sakshi

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టీకరణ

 జగ్గంపేట / కిర్లంపూడి: ‘‘జాతి కోసం పోరాటం సాగించాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ విశ్రమించను’ అని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పారు. ఆయన బుధవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యమం ద్వారా 20 శాతం విజయం సాధించామని, మిగిలిన 80 శాతం విజయం కోసం ఏడు నెలలు కష్టపడతామని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా కమిషన్  నివేదిక అందేలా చూస్తామని, కార్పొరేషన్‌కు తక్షణం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారని వెల్లడించారు.

Advertisement
Advertisement