చిత్తూరు (సెంట్రల్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ సిద్ధార్థ్జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రాత్రి 10 గంటలకు ఆయన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట నుంచి బయలుదేరి అర్ధరాత్రి 12.30 గంటలకు తిరుపతి ఫార్చూన్గ్రాండ్ రిడ్జ్ హోటల్కు చేరుకుని బస చేస్తారని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 7.15 గంటలకు బయలుదేరి 8.45 గంటలకు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. 10.30 గంటలకు అక్కడ బయలుదేరి 11.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని పేర్కొన్నారు.
అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీసిటీకి చేరుకుని 1.10 గంటలకు పెప్సికో యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం అక్కడ వ్యాపారవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. విలేకరుల సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్కు వెళతారని కలెక్టర్ తెలిపారు.
రేపు సీఎం రాక
Published Thu, Apr 2 2015 1:50 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement