జీడిపల్లి ఘటనపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ | Sakshi
Sakshi News home page

జీడిపల్లి ఘటనపై విచారణకు ఆదేశించిన కలెక్టర్

Published Sun, May 11 2014 10:43 AM

Collector enquiry on slight intensity earthquake shakes at jeedipalli village in anantapur district

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం జీడిపల్లిలో సంభవించిన భూ ప్రకంపనలపై జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ స్పందించారు. భూ ప్రకంపనలపై విచారణ జరపాలని కల్యాణదుర్గం ఆర్దీవోను ఆదేశించారు. విచారణ జరిపి నివేదికను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలలో ఆర్డీవోకు సూచించారు. జీడిపల్లి పరిసర ప్రాంతాలలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించడంతోపాటు భారీ శబ్దాలు వెలువడ్డాయి.

 

దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే హంద్రీ నీవా కాల్వ పనులలో భాగంగా కాంట్రాక్టర్ భారీగా మందుగుండు సామాగ్రి పేల్చారని అందువల్లే భూమి కంపించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతో భూ ప్రకంపనలపై వెంటనే నివేదిక అందజేయాలని కల్యాణదుర్గం ఆర్డీవోను కలెకర్ట్ లోకేష్ కుమార్ ఆదేశించారు.
 

Advertisement
Advertisement