సాక్షి, హైదరాబాద్: రక్తపాతం సృష్టించైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.. సీమాంధ్ర సమ్మెకు సీఎం కిరణ్ నాయకత్వం వహిస్తుంటే, ఏపీఎన్జీవోల సభకు డీజీపీ దినేశ్రెడ్డి రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన హైదరాబాద్లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, నాయకుడు రాజఎల్లయ్య మాదిగలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో సభలు జరుపుకొంటామంటే అనుమతివ్వని ప్రభుత్వం ఏపీఎన్జీవోల సభకు నాలుగురోజుల ముందే అనుమతి ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.
ఏపీఎన్జీవో సభను అడ్డుకొనేందుకు నలువైపుల నుంచి ప్రతిఘటన దళాలు సిద్ధంగా ఉంటాయని, ఆ ప్రతిఘటన ఏ రూపమైనా తీసుకోవచ్చని హెచ్చరించారు. ఈ నెల ఏడున తెలంగాణ ప్రజలు భారీగా తరలివచ్చి ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న కుట్రను భగ్నం చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఆరు, ఏడు తేదీల్లో హైదరాబాద్కు ప్రయాణించవద్దని, ఒకవేళ ప్రయాణాలేవైనాఉంటే రద్దు చేసుకోవాలని కోరారు. 6న అణగారినవర్గాల సభకు అనుమతివ్వనందుకు నిరసనగా శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోంది: మందకృష్ణ
Published Fri, Sep 6 2013 3:17 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement