ఏపీలో మరో 796 కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో 796 కరోనా కేసులు

Published Sat, Jun 27 2020 1:46 PM

Coronavirus: 796 New Positive Cases Registered In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మరో 740 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.
(చదవండి : భారత్‌లో 5లక్షలు దాటిన కరోనా కేసులు)

శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24,458 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 796 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,285కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 263 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 11 మంది  మృతి చెందారు. ఈ రోజు మృతి చెందిన 11 మందిలో కర్నూలు 4, కృష్ణా 4, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,648 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Advertisement
Advertisement