బీజేపీతోనే అవినీతి రహిత పాలన | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే అవినీతి రహిత పాలన

Published Sun, Jul 10 2016 12:03 AM

Corruption-free governance BJP

శ్రీకాకుళం న్యూకాలనీ: దేశంలో అవినీతి రహిత పాలన భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ మహిళా మోర్ఛా జాతీయ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శ్రీకాకుళంలోని నాగావళి హోటల్లో శనివారం జరి గిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యక్తలు కృషి చేయాలన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయిలో కమిటీలను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. మోదీ విదేశీ పర్యటనలతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చె ప్పారు. రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం ద్వారా పెద్ద ఎత్తున నిధులను అందజేస్తున్నట్లు చెప్పా రు.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, బీజేపీ కిసాన్‌మోర్ఛా రాష్ట్ర అధ్యక్షులు పూడి తిరుపతిరావులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ బలమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. రాష్ట్రం లోనూ అదే పంథాను కొనసాగించేందుకు నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. మాజీ ఎంపీ కణి తి విశ్వనాథం, బీజేపీ జిల్లా అధ్యక్షులు కోటగిరి నారాయణరావు, పార్టీ జిల్లా ఇన్‌చార్జి పీవీఎన్ మాధవ్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శవ్వాన ఉమామహేశ్వరిలు ప్రసంగిస్తూ బీజేపీ పాలనపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

అంతకుముందు సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని పురందేశ్వరి ఆవిష్కరించారు.  సమావేశంలో పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.భాగ్యలక్ష్మి, పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు సువ్వారి వెంకటసన్యాసిరావు, పార్టీ నేతలు శవ్వాన వెంకటేశ్వరరావు, చల్లా వెంకటేశ్వరరావు, బత్తుల పవన్‌సాయికుమార్, బెండి రవి, పాతిన గడ్డెయ్య, ఈశ్వరమ్మ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement