న్యూఢిల్లీ : తెలంగాణ, రాయలతెలంగాణ అంశాలపై చర్చలతో ఢిల్లీ వేడెక్కింది. ప్రధాన మంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రులు, ఎంపిలు, ప్రధాన ప్రతిపక్షమైన బిజేపి నేతలు ఇదే అంశంపై చర్చిస్తున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో అనుసరించవలసి వ్యూహం, తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదిక తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.
కోర్ కమిటీ సమావేశం ముగిసిన తరువాత కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే నేరుగా నార్త్బ్లాక్కు చేరుకున్నారు. జిఓఎం సభ్యుడు జైరామ్ రమేష్ షిండేతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయమే వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తెలంగాణ ఎంపిలు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ను కలిశారు. పది జిల్లాల తెలంగాణ మాత్రమే కావాలని కోరారు. మరోవైపు తెలంగాణ జెఏసీ నేతలు కోదండరామ్ నాయకత్వంలో బిజేపి నాయకురాలు సుష్మాస్వరాజ్ను కలిశారు. రాయలతెలంగాణకు అంగీకరించవద్దని వారు ఆమెను కోరారు.రాయలతెలంగాణ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తిలేదని ఆమె వారికి హామీ ఇచ్చారు. పది జిల్లాల తెలంగాణకే తాము కట్టుబడి ఉన్నట్లు ఆమె తెలిపారు. ఇంకోవైపు రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషిస్తున్న జిఓఎం సభ్యుడు జైరామ్ రమేష్ బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడును కలిసి రాయలతెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించమని నచ్చచెబుతున్నట్లు తెలిసింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమై ఇదే అంశంపై చర్చిస్తున్నారు.
ఈ రోజు సాయంత్రం జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశం కూడా తెలంగాణ బిల్లుపైనే చర్చిస్తుంది. తెలంగాణపై కేంద్ర మంత్రులు తలా ఒక మాట మాట్లాడటం, గందరగోళాన్ని సృష్టించడం విమర్శలకు దారి తీస్తోంది. ఒక రాష్ట్రాన్ని విభజించే అంశాన్ని స్పష్టంగా తెలియజేయకుండా కేంద్రం ఇంత గోప్యంగా ఉంచడాన్ని పలువురు నేతలు తప్పుపడుతున్నారు.
తెలంగాణపై చర్చలతో వేడెక్కిన ఢిల్లీ
Published Thu, Dec 5 2013 1:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement