వైఎస్‌ఆర్‌సీపీతోనే సమగ్రాభివృద్ధి | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీతోనే సమగ్రాభివృద్ధి

Published Sat, Apr 12 2014 4:00 AM

development on the state in ys jagan hands

శివ్వాం(గరుగుబిల్లి),న్యూస్‌లైన్:  దివంగత మహానేత వై.ఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమపథకాల అమలుతోపాటు రాష్ట్ర సమగ్రాబివృద్ధి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని  ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు అన్నారు.

గరుగుబిల్లి మండలంలో ని శివ్వాం గ్రామంలో శుక్రవారం జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవిభజనకు సహకరించిన పార్టీలు నేడు ఓట్లకోసం కల్లబొల్లికబుర్లు చెబుతున్నాయని విమర్శించారు. పార్టీ రాష్ట్రప్రచారకమిటీ సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ,మాజీ ఎంపీపీ ఉరిటి రామారావులు మాట్లాడుతూ త్వరలో రాష్ట్రానికి మంచిరోజులు రానున్నాయన్నారు.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమపథకాలన్నీ అమలు కావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలని అందుకోసం కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థిని, విజయనగరం ఎంపీ అభ్యర్థి బేబీనాయనకు ఓటు వేయాలని కోరారు.  కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బొబ్బిలి అప్పలనాయుడు, బోను.శంకరరావు, జి.వెంకటనాయుడు,కె.శీతంనాయుడు,డి.పాపినాయుడుతో పాటు పలువురు పాల్గొన్నారు.

150 కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరిక
మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, రాష్ట్రప్రచారకమిటీ సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు,పార్టీ మండల కన్వీనర్ బొ బ్బిలి అప్పలనాయుడుల సమక్షంలో గ్రామంలోని 150 కుటుంబాలు కాంగ్రెస్‌నువీడి వైఎస్‌ఆర్‌సీపీ లో చేరాయి.

పార్టీలో చేరిన వారిలో పల్ల హేమసుందర్,గుంట్రెడ్డి శంకరరావు,అల్లు అప్పలనాయుడు,బెల్లాన గౌరునాయుడు, బి. జగన్నాథం,పి.అప్పలనాయుడు,డి.అప్పలనాయుడు,ఎ.శంకరరావు,పి.బలరాం, జి.అప్పలనాయుడు, కె.గంగయ్య,పి.బలరాంనాయుడు, జి.ఎల్లంనాయుడు,ఆర్.ఎల్లయ్య,ఎ.ఎల్లయ్య,కె.పకీరు,పి.వెంకటనాయుడుతో పాటు ఎస్సీ, యాదవ సామాజిక వర్గాలకు చెందిన  పలువురు   ఉన్నారు.

Advertisement
Advertisement