సాక్షి, కడప : నందలూరు మండలం నల్లదిమ్మాయపల్లె గ్రామంలో అధికారులు పంటకోత ప్రయోగాలుచేస్తే ఎకరాకు దాదాపు 765 కేజీల దిగుబడిమాత్రమే వచ్చింది. ఎకరాకు 10 బస్తాల దిగుబడి మాత్రమే రావడం గమనార్హం.
చెన్నూరులో పంట కోత ప్రయోగాలు చేస్తే ఎకరాకు 988 కేజీల దిగుబడి మాత్రమే వచ్చింది. తుపాన్ కారణంగా ఎక్కువ తాలు పోయినట్లు రైతులు వాపోతున్నారు.
జిల్లాలో ఈ ఏడాది వరి సాగు చేసిన రైతులు నట్టేట మునిగారు. తెల్లదోమ, అగ్గితెగులుతో పాటు తుపాన్ల ధాటికి అన్నదాతలు విలవిల్లాడారు. పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఎకరాకు 2 నుంచి 20 బస్తాలలోపే సరాసరిన పంట దిగుబడి వచ్చే పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఇటీవల జిల్లాలో చేపట్టిన పంటకోత ప్రయోగాల్లో ఈ వాస్తవాలు వెల్లడైనట్లు సమాచారం. ఈ ఏడాది ఖరీఫ్లో 1,16,375 ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. సరాసరిన ఎకరాకు రూ. 15 నుంచి రూ. 20 వేల పెట్టుబడులు పెట్టారు. సాధారణంగా ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి రావాల్సి ఉంది.
సరాసరిన 20 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తారు. ఇలా వస్తే కనీసం పెట్టుబడులతో నష్టాలు లేకుండా గట్టేక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం వరి ధాన్యం బస్తా రూ. 1200 పలుకుతోంది. పంట కోత ప్రయోగాల లెక్కల ప్రకారం చూస్తే ఈ ఏడాది రైతుకు కనీసం పంట పెట్టుబడులు కూడా రావడం గగనమే. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వరి రైతుకు గుండె‘కోత’నే మిగిల్చింది.
పంట కోత ప్రయోగాలిలా...
వరికి పంటల బీమాకు సంబంధించి గ్రామం యూనిట్గా తీసుకుంటారు. జిల్లాలోని 51మండలాల్లోని 228 గ్రామాల్లో సరాసరిన 1224 చోట్ల 5 ఇన్టు 5 విస్తీర్ణంలో పంటకోత ప్రయోగాలు చేస్తారు. ప్రతి గ్రామంలో నాలుగు చోట్ల 5 ఇన్టు 5 విస్తీర్ణంలో పంటకోత ప్రయోగాలు చేసి ఎకరాకు 162 ప్లాట్లుగా చేసి సరాసరిన దిగుబడిని లెక్కగడతారు. ఈ దిగుబడి వివరాలను ప్రభుత్వానికి పంపుతారు. వీటి ఆధారంగా జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం (ఎన్ఏఐఎస్) రైతులకు పంటల బీమాను చెల్లిస్తుంది.
ప్రభుత్వ అంచనాల ప్రకారం 5 ఇన్ టు 5మీటర్ల విస్తీర్ణంలో 16 కేజీలు అంటే ఎకరాకు 1875 కేజీల వరి ధాన్యం రావాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా ఈఏడాది కొన్ని మండలాల్లో 2 నుంచి 10 బస్తాలలోపే పంట దిగుబడి రావడం గమనార్హం. దీంతో అన్నదాతలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. పంట రుణాలు ఇచ్చి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గుండె కోత
Published Thu, Dec 19 2013 3:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement