ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయింపులు 10% కుదింపు
బియ్యం, విద్యుత్ సబ్సిడీల భారం కుదింపే లక్ష్యంగా బాబు సర్కారు నిర్ణయం
పీఆర్సీ ఊసే లేదు.. 27 శాతం ఐఆర్కే సూచన
సాక్షి, హైదరాబాద్: పేద వర్గాలకు ఇచ్చే సబ్సిడీల భారాన్ని వీలైనంత మేర తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోని ప్రణాళికేతర కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి సంబంధించిన నిధుల్లో భారీగా కోతలు పెట్టిన ప్రభుత్వం.. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కే టాయింపుల్లో కూడా ఆ వర్గాలకు కేటాయింపులను ప్రస్తుతానికన్నా 10 శాతం మేర తగ్గించేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సబ్సిడీ బియ్యం, విద్యుత్ సబ్సిడీలను వీలైనంత వరకు తగ్గించేయనుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) బడ్జెట్ ప్రణాళికేతర కేటాయింపులకు, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికేతర కేటాయింపుల్లో సవరణలకు సంబంధించి ఆర్థిక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం.. సబ్సిడీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన కేటాయింపుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి 10% మేర తగ్గించి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. తద్వారా బియ్యం సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీల భారాన్ని తగ్గించుకోనుంది.
అలాగే ఇతర గ్రాంట్ ఇన్ ఎయిడ్ రంగాల కేటాయింపులను.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులకన్నా 10% మేర తగ్గించాలని పేర్కొంది. అంటే రైతుల రుణ విముక్తి, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య కార్డులు, వడ్డీలేని రుణాలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు, స్థానిక సంస్థలకు ఇచ్చే ఆర్థిక సాయం రంగాలకు కేటాయింపులను తగ్గించనున్నారన్నమాట. ఇక ఈ మార్గదర్శకాల్లో ఉద్యోగుల పీఆర్సీ ఊసే లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఉద్యోగుల వేతనాలకు కేటాయించిన మొత్తాన్ని 2% మేర తగ్గించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని ఆర్థిక శాఖ సూచించింది.
మధ్యంతర భృతిని 27 శాతంగా ప్రతిపాదించాలని పేర్కొంది. డీఏ కింద వేతనాల్లో 90% ప్రతిపాదించాలని తెలిపారు. ఇంటి అద్దె అలవెన్స్ కింద 15%, మెడికల్ రీయింబర్స్మెంట్కు 2%, ఆర్జిత సెలవు కింద 8% ప్రతిపాదించాలని పేర్కొన్నారు. కార్యాలయాలకు సంబంధించిన మంచినీరు, విద్యుత్ చార్జీలను ప్రస్తుత ఏడాదికన్నా 10% పెంచి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. తద్వారా ప్రజలకు సంబంధించిన నీటి, కరెంటు చార్జీల మోత కూడా తప్పదనే సంకేతాలిచ్చింది.
సబ్సిడీలపై కోతకు రెడీ
Published Mon, Feb 2 2015 2:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement