విజయనగరం అర్బన్, న్యూస్లైన్ : నాలుగేళ్లుగా ఉద్యోగులు కోరుతున్న హెల్త్కార్డులపై (నగదు రహిత వైద్యం) ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న మెడికల్ రీయింబర్స్మెంట్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టింది. త్వరలో పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్న ఈ పథకంలో నమోదు కోసం డిసెంబర్ 5 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు పొందవచ్చు. పథకం అమలులోకి వస్తే జిల్లాలో 11 వేలమంది ఉపాధ్యాయులు, సుమారు 20 వేల మంది ఇతర ఉద్యోగులు లబ్ధిపొందుతారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారుల అవగాహన కోసం పలు విషయాలను ఆన్లైన్లో పొందుపరిచారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల యాజమాన్యంలో పనిచేస్తున్న ఉద్యోగులు, అన్ని సర్వీసుల పింఛన్దారులు, కుటుంబ పింఛన్దారులు అర్హులు. ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు, 25 ఏళ్లలోపు నిరుద్యోగ కుమారుడు, అవివాహిత లేదా విడాకులు తీసుకున్న నిరుద్యోగ కుమార్తె పథకానికి అర్హులవుతారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు లేదా పింఛన్దారులైతే ఒకరి కంట్రిబ్యూషన్ సరిపోతుంది. ఏహెచ్సీటీ నిబంధనలు పాటించే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రుల జాబితాను www.gov.inలో పొందుపరుస్తారు.
తాత్కాలిక కార్డులకు www.ehf.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు సర్వీస్ పుస్తకంలోని పేజీ 1.2 జిరాక్స్ ప్రతులు, కొత్త సర్వీస్ పుస్తకం అయితే 4,5 పేజీల జిరాక్స్ ప్రతులు, ఫొటో, ఆధార్కార్డు జతచేయాలి. ఆరోగ్యశ్రీ ట్రస్టు సిబ్బంది ఉద్యోగి దరఖాస్తును పరిశీలించిన అనంతరం తాత్కాలిక ఆరోగ్యకార్డులు జారీ చేస్తారు. వీటిని రూ. 25 చెల్లించి ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చు. ఈ కార్డులు 90 రోజులు లేదా శాశ్వత కార్డులు జారీ అయ్యే వరకు పనిచేస్తాయి.
ఉద్యోగి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత శాశ్వత కార్డులు జారీ చేస్తారు. కార్డులు సీఐసీ (కంప్యూటర్ ఐడెంటిఫై సెంటర్) ద్వారా పొందాల్సి ఉంటుంది. ప్రతి రెవెన్యూ డివిజన్లోనూ ప్రభుత్వం సీఐసీ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. ఈ విషయమై ఉద్యోగులకు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. ఉద్యోగి కుటుంబసభ్యులందరూ సీఐసీకి వెళ్లి వేలిముద్రలు నమోదు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన 30 రోజుల వ్యవధిలో బయోమెట్రిక్ ఆరోగ్య కార్డులు జారీ చేస్తారు.
ఉద్యోగులకు హెల్త్కార్డు లు
Published Mon, Nov 18 2013 2:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు
హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు
జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా
ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
గోదారిలో గాలి కబుర్లే..!
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement