రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

Published Fri, Nov 15 2013 3:12 AM

Engineering student killed in road accident

ఏలూరు క్రైం, న్యూస్‌లైన్ : బైక్ కొన్నందుకు పార్టీ చేసుకున్న ఇద్దరు స్నేహితులు తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కలపర్రు టోల్‌గేట్ సమీపంలోని సాయిబాబా గుడి వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక విద్యానగర్ ప్రాంతానికి చెందిన గంజి అన్వేష్ (22) బి.టెక్ చదువుతున్నాడు. అతని స్నేహితుడు శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన ముత్తవరపు హర్షవర్దన్ కూడా బి.టెక్ చదువుతున్నాడు. హర్షవర్దన్ మోటారు సైకిల్ కొనడంతో పార్టీ ఇవ్వటానికి బుధవారం రాత్రి అన్వేష్‌ను తీసుకుని కొత్త బైక్‌పై హనుమాన్ జంక్షన్ వెళ్ళారు. అక్కడి నుంచి అర్ధరాత్రి వారిద్దరూ బైక్‌పై ఇంటికి బయలుదేరారు. కలపర్రు టోల్‌గేట్ సమీపంలోని సాయిబాబా గుడి వద్ద బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. అన్వేష్, హర్షవర్దన్‌లకు తీవ్రగాయాలయ్యాయి. హైవే పెట్రోలింగ్ పోలీసులు వారిద్దరినీ ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అన్వేష్ మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. హర్షవర్దన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement