{పత్యేక ప్యాకేజీకి హ్యాండ్ ఇచ్చిన కేంద్రం
గట్టిగా డిమాండ్ చేయలేకపోయిన టీడీపీ
మాట మార్చిన బీజేపీ
తిరుపతి: రాయలసీమ జిల్లాలకు ఒకొక్కదానికి రూ.50 కోట్లను మాత్రమే కేంద్రం విదిల్చింది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రభుత్వం పార్లమెంట్లో హామీ ఇచ్చింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. ఎన్నికల తర్వాత ఇలాంటి ప్యాకేజీ ఇస్తే దేశంలో పలు ప్రాంతాలకు ఇవ్వాల్సి వస్తుందని లింకు పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీపై మాట మార్చింది. ఈ తరహా ప్యాకేజీ ఇచ్చి ఉంటే జిల్లాలో అభివృద్ధి పనులకు తొలివిడతలోనే కనీసం దాదాపు రూ.500 కోట్లకు పైగా వచ్చేవి. ప్రత్యేక ప్యాకేజీ గురించి టీడీపీ కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయలేకపోతోంది. బీజేపీ నాయకులు సైతం కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ఇచ్చి మమ అనిపించింది.
పెండింగ్లో పలు ప్రాజెక్టులు
ప్రత్యేకంగా రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో బిల్లుపై చ ర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో తాగు, సాగు నీటితోపాటు మౌలిక వసతులు కల్పించడం కోసం భారీగా నిధులు ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం జిల్లాకు కేవలం రూ.50 కోట్ల నిధులు మాత్రమే కేటాయించడంతో అవి ఏమూలకు సరిపోయే ప్రసక్తి లేదు. ముఖ్యంగా జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రధాన ప్రాజెక్టులైన హంద్రీనీవా, గాలేరు - నగరి వంటి ప్రాజెక్టు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. వీటిని పూర్తి చేయడం కోసం వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ప్రభుత్వం ప్రకటించిన నామమాత్రపు నిధులతో జిల్లావాసులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా టీడీ పీ గట్టిగా కేంద్రాన్ని నిలదీసి ప్రత్యేక హోదా లభించేలా చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
రూ.50 కోట్లు ఏ మూలకు
Published Thu, Feb 5 2015 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement