ఉద్యోగుల నుంచి డబ్బులు మినహాయించుకుంటున్నా అందని ఈహెచ్ఎస్ సేవలు
ప్రైవేటు ఆస్పత్రుల డిమాండ్లపై మెట్టు దిగని ప్రభుత్వం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు
లబ్బీపేట : ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈహెచ్ఎస్ స్కీం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా లేదు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆ స్కీంలోని పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెల రోజుల్లో పరిష్కరించాలని అల్టిమేటం జారీ చేసినా, ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు ఒక్క డిమాండ్ను కూడా అంగీకరించే పరిస్థితిలో లేరని తెలిసింది. అదేమంటే మీడియాకు లీకులు చేస్తున్నారంటూ ఆస్పత్రుల యాజమాన్యాలనే తప్పుపట్టే ధోరణిలో వ్యవహరిస్తుండడంతో పరిస్థితి మరింత జటిలమవుతోంది. దీంతో ఆ చిక్కుముడి ఇప్పట్లో వీడేలా లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలోని ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రుల్లో సేవలు పొందవచ్చునని ఇటీవల కలెక్టర్ ప్రకటించడంతో హెల్త్ కార్డు పట్టుకుని వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వానికి, ఆస్పత్రులకు మధ్య ఇంకా సరైన అంగీకారం కుదరకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆర్భాటంగా పథకాన్ని ప్రారంభించి, ఇప్పుడు అమలు చేయడంలో దోబూచులాట ఎందుకని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
వాస్తవమేమిటంటే...
ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సేవలు అందించడంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిని పరిష్కరించే వరకూ సేవలు అందించబోమని తేల్చి చెప్పడంతో రీయింబర్స్మెంట్ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ ప్రభుత్వం పొడిగించింది. ఈలోపే ప్రైవేటు ఆస్పత్రులతో చర్చలు జరిపి పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో వారం రోజుల కిందట పలువురు ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో పాటు ఎన్జీవో నాయకులతో ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆస్పత్రుల డిమాండ్ల విషయంలో ఎటువంటి అవగాహన కుదరలేదని తెలిసింది. మూడు నెలలుగా ఉన్న బకాయిలు మాత్రం విడతల వారీగా విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఉచితంగా ఓపీ సేవలు, ఇన్వెస్టిగేషన్స్ చేయలేమని ఆస్పత్రులు తేల్చి చెబుతుండగా, ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.
జీతాల్లో రూ.8 కోట్లు వసూలు
ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి రాక ముందే ఉద్యోగుల జీతాల్లో మాత్రం పథకానికి సంబంధించి డబ్బుల కట్ చేశారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉండగా, వారి నుంచి నవంబరు, డిసెంబరు నెల జీతాల నుంచి దాదాపు రూ.8 కోట్లు వరకూ జీతాల్లో కట్ చేశారని ఉద్యోగులు అంటున్నారు. పథకం అమలు చేయలేనప్పుడు డబ్బులు ఎందుకు మినహాయించారని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉద్యోగులకు నగదు రహిత సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
వీడని సిక్ముడి
Published Tue, Jan 13 2015 1:57 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మూడంచెల పటిష్ట భద్రత
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్కు ఎంపిక
సింగరేణి ఎక్స్టర్నల్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ
అమ్మో ఇవేం పరీక్షలు..?
ప్రభుత్వాస్పత్రిలో ఇంటి దొంగలు..!
రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ప్లాంటేషన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
తప్పక చదవండి
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement